సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే మ్యాచ్ లకు దూరమైన కోహ్లీ…
గత వారం విరాట్ కోహ్లీ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే టీ20 ఫార్మాట్లో నాయకునిగా తప్పుకున్న కోహ్లీ వన్డే ఫార్మాట్ లో కెప్టెన్ గా కొనసాగాలని అనుకున్నాడు. కానీ వైట్ బల్ ఫార్మాట్ లలో ఇద్దరు కెప్టెన్లు వద్దు అని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో బీసీసీఐ పై విరాట్ కోహ్లీ కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి సిద్ధమైన టీం ఇండియా… ఆ తర్వాత అక్కడ వన్డే సిరీస్ కూడా ఆడనుంది. కానీ ఈ సిరీస్ కు విరాట్ దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
Read Also : సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ ఔట్… ఆ స్థానంలో..?
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
అయితే రోహిత్ శర్మ తో విరాట్ కోహ్లీకి ఈ మధ్య బాగా గ్యాప్ పెరిగిందని… అందుకే వన్డే మ్యాచ్ లకు కోహ్లీ దూరమవుతున్నట్లు సమాచారం. కానీ వ్యక్తిగత కారణాలతో వన్డేలకు అందుబాటులో ఉండను అని కోహ్లీ బీసీసీఐ చెప్పాడు అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీం ఇండియా మొదట ఆడనున్న టెస్ట్ సిరీస్ కు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. దాంతో… కోహ్లీ కెప్టెన్ గా ఉన్న టెస్టులకు రోహిత్ శర్మ…. రోహిత్ కెప్టెన్ గా ఉన్న వన్డే లకు కోహ్లీ దూరం కావడంతో ఈ ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు అనేది అర్ధమవుతుంది. ఇక కోహ్లీ వన్డేలకు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో