317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరెస్టు చేసిన టీచర్లందరిని ప్రభుత్వం భేషరుతుగా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. Read Also: గాలిపటం కోసం కరెంట్ పోల్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న బాలుడు 317 జీవోను…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని…
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్ఎస్ పోలీస్ కమిషనర్ను ఎలా కాపాడుతుంది? సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి…
దమ్ముంటే కేసీఆర్ను టచ్ చేసి చూడండి.. మా దమ్ము ఏంటో చూపిస్తామని సవాల్ విసిరార్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు. బీజేపీ పాలితరాష్ట్రల్లో రైతుబంధు ఉందా ? తెలంగాణలో వ్యవసాయ భూములకు భారీగా ధరలు.. ఆంధ్రాలో డమాల్ అంటూ వ్యాఖ్యానించారు.…
తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్కి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బీజేపీ పాలితరాష్ట్రాల్లో రైతుబంధు ఉందా? అని ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణలో వ్యవసాయభూములకు భారీగా ధరలు వచ్చాయని, అదే టైంలో ఆంధ్రాలో ధరలు ఢమాల్ అన్నాయన్నారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి… మా దమ్ము ఏంటో చూపిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ బుడ్డారఖాన్……
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల…
ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అంతా ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట. ఒకవైపు బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘావర్గాలు ఆరా తీశాయట. ఇంతకీ ఎవరా నాయకులు? పార్టీ ఆఫీస్కూ రావడం లేదని ఆరా..?తెలంగాణలో బీజేపీ నాయకులు వరసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు. జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్ బండి సంజయ్ను అరెస్ట్ చేయడంతో…
నిన్న వరంగల్లో బీజేపీ శ్రేణులు వచ్చి అధికార టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని, మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ…
రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి…