దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అసలు…
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాబోయే రెండేళ్ళు కష్టపడి పనిచేద్దాం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ అనుబంధ మోర్చాల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షించిన బండి సంజయ్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలలో నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల కల్పన కోసం ‘కోటి సంతకాల సేకరణ’చేపడతామన్నారు. జనం బీజేపీ పక్షాన ఉన్నారనే భయంతోనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ నుండి దాడులు…
దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు.…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు. Read Also: నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర…
సీఎం కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండలో బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి దాడి చేశారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ను ప్రజలు పాలించడానికి ఎన్నుకున్నారా గుండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా ..? అంటూ ప్రశ్నించారు. యువమోర్చా…
వేములవాడ రాజన్న సిరిసిల్లా జిల్లాలో రాజరాజేశ్వర స్వామి దర్శన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అన్ని సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. సర్వేల రిపోర్టుతో కేసీఆర్ ఖంగుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు దిగజారిపోతుంది. కార్యకర్తల త్యాగాల ఫలితంగా రానున్న రోజులు బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తా అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం…
బీజేపీ పై మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి నియంత పాలనను….ఎప్పుడూ చూడలేదని, బీజేపీ వైఖరి మారక…
బండి సంజయ్ చేసిన 317 జీవోను రద్దు చేయాలని చేసిన ఉద్యోగ దీక్షలో పోలీసులు బండి సంజయ్ని అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.. దీనిపై బండి సంజయ్ ప్రవిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. .బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ…
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఈరోజు జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు…