బీడీఎస్ పరీక్షలు వాయిదా వేయాలి.. బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా ఆంక్షలు విధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనెల 20వరకూ ఆంక్షలు వున్నా అవి సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్ధులకు నిర్వహించనున్న వివిధ పరీక్షలు రద్దవుతున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బీడీఎస్ పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.
కోవిడ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ సోకిన వాళ్ళు పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు ఎలా రాస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తోందని తెలిసి కూడా ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలని మొండిగా వ్యవహరించడం సరికాదు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
విద్యార్థుల ఆరోగ్యము, వాళ్ళ భవిష్యత్తు గురించి కొద్దిగా కూడా ఆలోచించరా? ఇప్పటికే చాలా యూనివర్సిటీలు పరీక్షల్ని వాయిదా వేసుకున్నాయి. బీడీఎస్ పరీక్షల నిర్వహణపై పై కాళోజీ నారాయణరావు వైద్య విశ్వ విద్యాలయం వెంటనే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. ఇదిలా వుండగా తెలంగాణలో కొత్తగా 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కాస్త పెరుగుదల నమోదయింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు.
ఇదిలా వుండగా ఈ నెల 30 వ తేదీ వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని అనుబంధ కళాశాలలకు ఆదేశాలు జారీ చేశాయి జేఎన్టీయూ, ఓయూ. 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశాయి. 30 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి రెండు యూనివర్సిటీ లు.
తాజావార్తలు
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..