పార్టీల మధ్య నలుగుతున్న సీపీ
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్ఎస్ పోలీస్ కమిషనర్ను ఎలా కాపాడుతుంది?
సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!
కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి సంజయ్. దీక్షకు అనుమతి లేదని బీజేపీ నాయకులకు ముందే చెప్పామన్నది కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వాదన. అయితే CP కావాలనే దీక్షను అడ్డుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా బండి సంజయ్పై గతంలో ఉన్న కేసులను తిరగదోడారని కాషాయ పార్టీ మండిపడుతోంది. సీపీ సత్యనారాయణపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు సంజయ్.
Also Read
దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ గుర్రు..!
గతంలోనూ సీపీ సత్యనారాయణపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు సంజయ్. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందితే.. అక్కడే ఉన్న తనపై సీపీ జులుం ప్రదర్శించారన్నది బీజేపీ చీఫ్ ఆరోపణ. తాజా ఎపిసోడ్లో పోలీసుల తీరు మోతాదు మించిందని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. పోలీసులు లాఠీచార్జీతోపాటు మహిళా నాయకులు, కేడర్పై దాడులు చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.
రూల్స్ ప్రకారమే దీక్ష భగ్నం.. రాజకీయ కోణం లేదన్న సీపీ
దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణచుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా CP ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఈ ఆరోపణలపై స్పందించిన సీపీ సత్యనారాయణ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీక్షను భగ్నం చేశామని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. అయితే సీపీ సత్యనారాయణపై తప్పకుండా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తరుణ్చుగ్, బండి సంజయ్ లాంటి నేతలు ప్రకటనలు చేయడం చర్చగా మారింది.
పార్టీల మధ్య గొడవలతో పోలీసులు నలిగిపోతున్నారా?
పాలకవర్గం చెప్పినవి పోలీసు అధికారులు తూచా తప్పకుండా పాటించడం.. పైనుంచి వచ్చే ఆదేశాలతో ఎలా చెప్తే అలా వ్యవహరించడం నిత్యం జరిగేదే. అది అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంది. కాకపోతే పొలిటికల్ పార్టీల మధ్య గొడవలతో పోలీసులు.. ఇతర అధికారులు నలిగిపోతున్నారని.. డిపార్ట్మెంట్లో చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే బీజేపీ ఫిర్యాదుల నుంచి సీపీ సత్యనారాయణను టీఆర్ఎస్ సర్కార్ ఎలా కాపాడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!