పార్టీల మధ్య నలుగుతున్న సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్ఎస్ పోలీస్ కమిషనర్ను ఎలా కాపాడుతుంది?
సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!
కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి సంజయ్. దీక్షకు అనుమతి లేదని బీజేపీ నాయకులకు ముందే చెప్పామన్నది కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వాదన. అయితే CP కావాలనే దీక్షను అడ్డుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా బండి సంజయ్పై గతంలో ఉన్న కేసులను తిరగదోడారని కాషాయ పార్టీ మండిపడుతోంది. సీపీ సత్యనారాయణపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు సంజయ్.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ గుర్రు..!
గతంలోనూ సీపీ సత్యనారాయణపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు సంజయ్. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందితే.. అక్కడే ఉన్న తనపై సీపీ జులుం ప్రదర్శించారన్నది బీజేపీ చీఫ్ ఆరోపణ. తాజా ఎపిసోడ్లో పోలీసుల తీరు మోతాదు మించిందని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. పోలీసులు లాఠీచార్జీతోపాటు మహిళా నాయకులు, కేడర్పై దాడులు చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.
రూల్స్ ప్రకారమే దీక్ష భగ్నం.. రాజకీయ కోణం లేదన్న సీపీ
దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణచుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా CP ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఈ ఆరోపణలపై స్పందించిన సీపీ సత్యనారాయణ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీక్షను భగ్నం చేశామని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. అయితే సీపీ సత్యనారాయణపై తప్పకుండా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తరుణ్చుగ్, బండి సంజయ్ లాంటి నేతలు ప్రకటనలు చేయడం చర్చగా మారింది.
పార్టీల మధ్య గొడవలతో పోలీసులు నలిగిపోతున్నారా?
పాలకవర్గం చెప్పినవి పోలీసు అధికారులు తూచా తప్పకుండా పాటించడం.. పైనుంచి వచ్చే ఆదేశాలతో ఎలా చెప్తే అలా వ్యవహరించడం నిత్యం జరిగేదే. అది అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంది. కాకపోతే పొలిటికల్ పార్టీల మధ్య గొడవలతో పోలీసులు.. ఇతర అధికారులు నలిగిపోతున్నారని.. డిపార్ట్మెంట్లో చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే బీజేపీ ఫిర్యాదుల నుంచి సీపీ సత్యనారాయణను టీఆర్ఎస్ సర్కార్ ఎలా కాపాడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!