మహిళల ప్రపంచకప్లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్కౌర్ (57…
ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ ఆడుతోంది భారత మహిళల జట్టు.. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓడి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న మిథాలీ సేన.. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.. ఇక, టాప్ 4లో స్థానం దక్కాలంటే మాత్రం.. ఈ మ్యాచ్లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్లో ముందుకు సాగాలంటే.. ఈ మ్యాచ్…
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన రావల్పిండి పిచ్కు ఐసీసీ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదేళ్లలో 5 డీమెరిట్ పాయింట్లు వస్తే 12 నెలల పాటు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వీల్లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆడిన తొలి టెస్టులో పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది. దీంతో పాకిస్థాన్…
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్వార్న్ ఈనెల 4న థాయ్లాండ్లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో రోజుల తర్వాత వార్న్ డెడ్బాడీ ప్రత్యేక విమానం ద్వారా గురువారం నాడు థాయ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకుంది. శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. థాయ్లాండ్లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్బోర్న్కు డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో షేన్వార్న్ మృతదేహాన్ని థాయ్ ప్రభుత్వం తరలించింది.…
క్రికెట్లో మన్కడింగ్ పలు మార్లు ఎలాంటి వివాదాలను సృష్టించిందో గతంలో ఎన్నో సార్లు చూశాం. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్ స్ట్రైకర్ ముందే క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు. అయితే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో మెల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వివాదాలకు కారణమయ్యే మన్కడింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. బౌలింగ్ సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న ఆటగాడు పరుగు కోసం సిద్ధంగా ఉండాలి కాబట్టి అందులో భాగంగానే…
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయ్లాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడి హోటల్ గదిలో విగతజీవుడై పడిఉన్న సంగతి అతడి వ్యక్తిగత సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. అయితే వార్న్ మరణంపై థాయ్లాండ్ పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుండెపోటుతో కింద…
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్వార్న్(52) హఠాన్మరణం చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు ఆస్ట్రేలియాలో మీడియా వెల్లడించింది. తొలుత తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ గుండెపోటుకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు…
ప్రపంచంలో చాలా రకాల గేమ్స్ జరుగుతుంటాయి. కొన్ని క్రేజీగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఫన్నీ గేమ్స్ టోర్నమెంట్లో గోఫిష్ టోర్నమెంట్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగాంబీలోని ఫ్రెష్ వాటర్ కెనాల్లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించారు. ముర్రె కాడ్ ఫిష్ లకు ఈ నగాంబీ ఫ్రెష్ వాటర్ ప్రసిద్ది. ఇందులో ముర్రె కాడ్ ఫిష్లు ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎవరైతే పెద్దవైన ముర్రె కాడ్ ఫిష్ ను పట్టుకుంటారో వారికి 80 వేల డాలర్లను…
టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతున్నది. సాంకేతికతలను అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యరంగంలో టెక్నాలజీ సహాయంతో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. జరుగుతున్నాయి. గుండెకోసం వినియోగించే పేజ్ మేకర్ మొదలు కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇతర కీలక అవయవాల మార్పిడిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. సరైన సమయంలో అవయావాలు అందక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని వివిధ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. ఈ కోవలోనే బయోనిక్ కళ్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు.…
37 ఎలేనా అనే మహిళ తన కొడుకుతో కలిసి ఉత్తర నార్వేలోని గాస్వాయర్ సముద్రం వద్ద పడవలో వెళుతుండగా ఆమెకు ఓ బాటిల్ దొరికింది. తొలుత ఆ బాటిల్ను ఆమె మద్యం బాటిల్ అనుకొని తీసుకుంది. అయితే, అందులో లెటర్ కనిపించడంతో బాటిల్ను ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఒపెన్ చేసింది. అందులోని లెటర్ను చూసి ఆశ్చర్యపోయింది. సుమారు పాతికేళ్ల క్రితం 8 సంవత్సరాల వయసున్న జోహన్నా బచాన్ అనే 8 ఏళ్ల చిన్నారి లెటర్ రాసి దానిని…