ఆస్ట్రేలియాలో ఇటీవల ఫెడరల్ ఎన్నికల్లో వందలాది మంది అర్ధనగ్నంగా పాల్గొనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా మహిళలు స్విమ్సూట్ ధరించగా.. పురుషులు అండర్వేర్లో వెళ్లి ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే మహిళలు, పురుషులు ఇలా అర్ధనగ్నంగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఓ కారణముంది. ‘బడ్జీ స్మగ్లర్స్’ అనే బట్టల కంపెనీ అక్కడి ఓటర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. అండర్వేర్లో వెళ్లి ఓటేస్తూ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని తెలిపింది.…
ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారి ఎన్నికల్లో గెలుపొందడంతో… ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా 1.70 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ద్రవ్యోల్బణంలో దేశ వాసులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్థిక సాయం, సామాజిక…
ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించడంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. 46 ఏళ్ల వయసులోనే సైమండ్స్ మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు సైమండ్స్కు రోడ్డుప్రమాదం జరిగిన ప్రదేశంలోనే అతని సోదరి లూయిస్ ఓ భావోద్వేగ లేఖను రాసి ఉంచడం అందరినీ కలిచి వేస్తోంది. Read Also: Thomas Cup : చరిత్ర సృష్టించిన భారత జట్టుకు కోటి రూపాయల బహుమతి ‘చాలా త్వరగా అందనంత దూరంగా…
ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు…
ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కానుంది. త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించనుంది. మరోవైపు ఈ ఏడాదంతా టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్తో గడపబోతోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో…
మహిళల వన్డే ర్యాంకులను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టాప్-10 ర్యాంకుల్లో ఇటీవల వన్డే ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా మహిళలు డామినేట్ చేస్తున్నారు. ఈ జాబితాలో టాప్-10లో ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా మహిళలే ఉండటం విశేషం. ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాటర్ల ర్యాంకుల్లో టాప్-1లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలీస్సా హిలీ నిలిచింది. ఆమె ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై సెంచరీతో రాణించింది. ప్రపంచకప్లో మొత్తం 9 మ్యాచ్లు ఆడిన ఆమె 509…
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం…
క్రికెట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన సత్తా నిరూపించుకుంది. పురుషుల జట్టుతో తీసిపోని రీతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కూడా వరుసగా టైటిళ్లు సాధిస్తోంది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు భారీ…
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్లో వెస్టిండీస్పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్…
పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.…