వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా రూ.100 కోట్ల పనుల్లో 30 శాతం పనులు పూర్తి చేశామని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరుకు చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. బడ్జెట్లో 6 లక్షల 46 వేల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కూటమి ప్రభుత్వం.. టీడీపీ 2019 నాటికి 4 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పాలకొల్లు మండలంలోని 8 గ్రామాల సర్పంచులు వైసీపీకి గుడ్ బై చెప్పి.. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. రాష్ట్ర జల వనరుల శాఖ…
దేశంలో కరడుగట్టిన కేడీ గాళ్లను కటకటాల పాలు చేసిన పోలీసులు ఉన్నారు.. బడా చోర్ల ఆటకట్టించిన ఖాకీలు కూడా ఉన్నారు. అంతేకాదు దొంగలతో కలిసి వాటాలు పంచుకున్న ఖాకీలు కూడా ఉన్నారండోయ్.. అది కూడా పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్ చేసుకున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. కేసు మాఫీ కోసం ఏకంగా స్టేషన్లో పోలీసులు వాటాలు పంచుకున్నారు. వివరాల ప్రకారం… తణుకు మండలం వేల్పూర్లో ఆకుల…
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీని భాధకు గురిచేసిందన్నారు. రామ్మూర్తి నాయుడు గారు విప్ బాధ్యతలు తనకు అప్పగించారని, ఎంత బరువైనా పూర్తి సామర్థ్యంతో పని చేస్తానన్నారు. కడప నగరంలో మంచి నీరు, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పుకొచ్చారు. శనివారం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకువచ్చారు. మంత్రి నారా లోకేశ్, హీరో నారా రోహిత్ సహా కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. మరికాసేపట్లో నారావారిపల్లెకు రానున్నారు. Also Read: AUS vs IND: నేనే రోహిత్…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు ఆయన భౌతికకాయం చేరుకుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ,ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు…
తన దగ్గర డబ్బులు లేవని, కానీ నూతనమైన ఆలోచనలు మాత్రం ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం అని, ఆదాయం స్వీడ్గా వస్తుందన్నారు. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్, జీతాలు ఇస్తున్నాం అని.. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. రాష్ట్ర ఆస్తులు కాపాడతాం అని, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం అని…
తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్టైక్ రేట్తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు…
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు…
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారని, ఉపాధ్యాయులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని మంత్రి లోకేశ్ చెప్ప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రసంగించారు. ‘ఎన్నికలకు రెండు నెలల ముందు గత…