MLA Peddireddy: పుంగనూరు ఎస్టేట్ వ్యవహారంపై పెద్దిరెడ్డి రియాక్షన్..
- పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం
- గతంలో పరువు నష్టం దావా వేశాం
- దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేశా
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుంగనూరు ఎస్టేట్పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. “సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం.. అప్పుడే మామిడి చెట్లు పెట్టాం. ఇరవైఏళ్ళ తరువాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో కిరణ్ కూమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిగింది. అది ప్రైవేట్ భూమి అని నివేదిక ఇచ్చారు..” అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతంటే?
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
భూమి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను మీడియాకు చూయించారు. “ఒక అబద్దాన్ని పదిసార్లు చేబితే నిజం అయిపోదు… తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా మళ్ళీ వేస్తాం.. చంద్రబాబు తాన అంటే పవన్ కల్యాణ్ తందాన అంటున్నారు.. ఎన్నికల ముందు నలబై వేల కోట్లు ఇసుకలో దోచుకున్నాడని నాపై పవన్ ప్రచారం చేశారు.. ఇప్పుడు ఎందుకు నామీద చర్యలు తీసుకోవడం లేదు.. రెడ్ శ్యాండిల్ అక్రమ రవాణా చేశారని ప్రచారం చేశారు.. అటవీశాఖ మంత్రిగా ఉండి. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. వైసీపీ నేతలు దొంగలు అనేలా విష ప్రచారం చంద్రబాబు, పవన్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి.. ఇప్పుడు చేయాలేను అని చంద్రబాబు చేతులెత్తారు. సిగ్గులేకుండా చంద్రబాబు అబద్ధాలు చేబుతున్నారు. ఎంతమంది పోయినా ఎంత మంది వచ్చిన పార్టీకి ఏమీ కాదు. మళ్ళీ వైసీపీ గతం కంటే ఎక్కవ సీట్లలో విజయం సాధించడం ఖాయం.. జగన్, విజయమ్మతో పుట్టిన పార్టీ ఇది.. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం.. మేము గతంలో ఇచ్చిన హామీల్లో 98శాతం అమలు చేశాం.” అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..