MLA Peddireddy: పుంగనూరు ఎస్టేట్ వ్యవహారంపై పెద్దిరెడ్డి రియాక్షన్..
- పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం
- గతంలో పరువు నష్టం దావా వేశాం
- దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేశా
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుంగనూరు ఎస్టేట్పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. “సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం.. అప్పుడే మామిడి చెట్లు పెట్టాం. ఇరవైఏళ్ళ తరువాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో కిరణ్ కూమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిగింది. అది ప్రైవేట్ భూమి అని నివేదిక ఇచ్చారు..” అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతంటే?
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
భూమి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను మీడియాకు చూయించారు. “ఒక అబద్దాన్ని పదిసార్లు చేబితే నిజం అయిపోదు… తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా మళ్ళీ వేస్తాం.. చంద్రబాబు తాన అంటే పవన్ కల్యాణ్ తందాన అంటున్నారు.. ఎన్నికల ముందు నలబై వేల కోట్లు ఇసుకలో దోచుకున్నాడని నాపై పవన్ ప్రచారం చేశారు.. ఇప్పుడు ఎందుకు నామీద చర్యలు తీసుకోవడం లేదు.. రెడ్ శ్యాండిల్ అక్రమ రవాణా చేశారని ప్రచారం చేశారు.. అటవీశాఖ మంత్రిగా ఉండి. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. వైసీపీ నేతలు దొంగలు అనేలా విష ప్రచారం చంద్రబాబు, పవన్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి.. ఇప్పుడు చేయాలేను అని చంద్రబాబు చేతులెత్తారు. సిగ్గులేకుండా చంద్రబాబు అబద్ధాలు చేబుతున్నారు. ఎంతమంది పోయినా ఎంత మంది వచ్చిన పార్టీకి ఏమీ కాదు. మళ్ళీ వైసీపీ గతం కంటే ఎక్కవ సీట్లలో విజయం సాధించడం ఖాయం.. జగన్, విజయమ్మతో పుట్టిన పార్టీ ఇది.. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం.. మేము గతంలో ఇచ్చిన హామీల్లో 98శాతం అమలు చేశాం.” అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!