CM Chandrababu: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు!
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం
- ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో ప్రచారం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో సీఎం ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది. తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఏపీ సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సమయం ఆసన్నమవుతుండంతో ప్రచారం జోరందుకుంది. పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి బీజేపీ అగ్రనాయకత్వం దింపుతోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ సీఎం చంద్రబాబును బీజేపీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం సిద్దమయ్యారు. ఎన్టీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!