AP DGP: ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం!
- గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం
- సీసీ కెమెరాలు ఏర్పాటుపై దృష్టి
- చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి.. ఐజీ అధికారిని నియమించామన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా.. మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉందని, గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం అని డీజీపీ చెప్పారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి.. కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
అనకాపల్లిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ… ‘ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించాం. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం. ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్స్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉంది. గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం. గంజాయి మహమ్మారికి బానిసలుగా మారోద్దని యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సంకల్ప రథాలు ద్వారా ప్రచారం చేస్తున్నాం’ అని చెప్పారు.
Also Read
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
‘సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని భావిస్తున్నాం. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించాం. సీసీ కెమెరాలను దాతల, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా.. ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల హాట్ స్పాట్లను గుర్తించాం. రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. పోలీసులు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేయాలి. రాష్ట్ర మొత్తంగా క్రైమ్ రేట్ తగ్గడం అభినందించదగ్గ విషయం’ అని డీజీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!