AP DGP: ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం!
- గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం
- సీసీ కెమెరాలు ఏర్పాటుపై దృష్టి
- చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి.. ఐజీ అధికారిని నియమించామన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా.. మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉందని, గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం అని డీజీపీ చెప్పారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి.. కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
అనకాపల్లిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ… ‘ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించాం. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం. ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్స్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉంది. గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం. గంజాయి మహమ్మారికి బానిసలుగా మారోద్దని యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సంకల్ప రథాలు ద్వారా ప్రచారం చేస్తున్నాం’ అని చెప్పారు.
Also Read
‘సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని భావిస్తున్నాం. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించాం. సీసీ కెమెరాలను దాతల, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా.. ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల హాట్ స్పాట్లను గుర్తించాం. రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. పోలీసులు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేయాలి. రాష్ట్ర మొత్తంగా క్రైమ్ రేట్ తగ్గడం అభినందించదగ్గ విషయం’ అని డీజీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!