కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్…
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మార్కాపురంలో మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును వేయాల్సిన పేరుని తప్పుగా ముద్రించారు మునిసిపల్ అధికారులు. ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు అధికారులు. వెంటనే గుర్తించి…
ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు…
https://www.youtube.com/watch?v=CawKxErwBZY శనివారం రోజు.. ఈ ఏరాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపడితే మంచి ఫలితాలు సాధిస్తారు..? ఏ రాశివారు వాటికి దూరంగా ఉంటే మంచిది..? ఏ రాశివారు ప్రయాణలు చేయాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. ? ఇలా బుధవారానికి వివిధ రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర మంత్రికి, విమానయాన సంస్థలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ అన్నారు. ఎంతోమందికి ఉపయుక్తంగా ఉన్న విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఏయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్, మరియు స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు లేఖలు రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్…
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ డెడ్ బాడీ లభించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు నారా లోకేష్. డ్రైవర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంత బాబే హత్య చేశాడని జరిగిన ఘటన గురించి లోకేషుకి వివరించారు సుబ్రహ్మణ్యం తల్లి, భార్య. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న మాపై పోలీసులు దాడి చేశారని…
కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం రేపుతోంది? అసలేం జరిగిందనేది హాట్ టాపిక్ అవుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు…
తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి బందరి కాలనీ, రాయల్ నగర్ వద్ద ఇళ్ళు కూల్చివేత టెన్షన్ వాతావరణం సృష్టించింది. 40 ఏళ్ళుగా తామిక్కడ నివాసం వుంటున్నామని, తమ అధీనంలో ఉన్న ఇళ్ళను ఇక్కడ ప్రజా ప్రతినిధులు కబ్జా చేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఖరీదైన స్థలం కావడంతో కబ్జా దారుల కన్ను పడిందని మహిళలు ఆరోపిస్తున్నారు. తిరుపతి రెవెన్యూ అధికారులు, పోలిసుల సమక్షంలో కబ్జాలు చేస్తున్నారని మహిళలు అడ్డుకున్నారు. తమ ఆధీనంలో ఇళ్ళకు అన్ని…