Korumutla Srinivas: 14ఏళ్ళు సీఎంగా వుండి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సభలో టీడీపీ నేతల వైఖరి తలదించుకునేలా ఉందన్నారు విప్ కోరుముట్ల శ్రీనివాస్. టీడీపీ నేతలు అసలెందుకు సభకు వస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రోజూ రావడం గొడవ గొడవ చేయడం ఇదేనా మీ పని. ఎన్టీఆర్ పేరు పలకడానికి కూడా టీడీపీ నేతలకు లేదు. ఎన్టీఆర్ పై జగన్ కు అమితమైన గౌరవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు.
టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్. అంబేద్కర్ పేరు పెడితే గొడవలు సృష్టించారు. కుప్పం ప్రజల జీవన విధానంలో మార్పులొచ్చాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా సంక్షేమం అందడంతో ప్రజలు మాకు అండగా నిలిచారు. కుట్రలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ జగన్ కు ప్రజల్లో ఆదరణ రావడం తట్టుకోలేక చంద్రబాబు ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటాడు. మరో విప్ కరణం ధర్మశ్రీ సభలో టీడీపీ నేతలు రోజుకో విన్యాసం చేస్తున్నారని విమర్శించారు. అరణ్యవాసంలో ఉండి అజ్ఞాతవాసం చేస్తున్నా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎన్టీఆర్ పై అపారమైన ప్రేమ ఉన్నట్లు టీడీపీ నేతలు నటిస్తున్నారు. మనుషుల్ని వాడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
ఎన్టీఆర్ పేరు చెప్పి రాజకీయ వ్యభిచారం చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. ఎన్టీఆర్ పట్ల అంత ప్రేమ ఉంటే పథకాలకు ఎందుకు ఆయన పేరు పెట్టలేదు. ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్లకార్డు తేవడం నిరసన చేయడం..ప్రదర్శించడం బయటికి పోవడం ఇదే టీడీపీ పని. సభలో ఈరోజు టీడీపీ నేతల ప్రవర్తన బాధాకరం..
స్పీకర్ పట్ల టీడీపీ నేతలు అమర్యాదగా ప్రవర్తించారు. బలహీన వర్గానికి చెందిన స్పీకర్ పట్ల ప్రతిపక్షపార్టీకి మొదటి నుంచి చిన్నచూపే. స్పీకర్ కు మొత్తం టీడీపీ నేతలంతా క్షమాపణ చెప్పాలి. ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ఆర్. హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతుందే టీడీపీ భయపడుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ నుంచి ఎన్టీఆర్ పేరు తీసేస్తానని చెప్పింది చంద్రబాబు కాదా? మరి ఇప్పుడెందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు సన్ క్షోభంలో ఉన్నాడు.. టీడీపీ పార్టీ సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.
Read Also: Kusukuntla Prabhakar :మునుగోడు ఉపఎన్నికపై టీఆర్ఎస్ నాన్చుడు వెనుక మతలబు ఏంటి?
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!