Venkaiah Naidu: ఇప్పుడే నాకు ఫ్రీడమ్ కలిగింది.. అందరినీ కలుస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎమోషనల్ అయ్యారు. ఉపరాష్ట్రపతిగా పదవి కాలం పూర్తయిన తర్వాతనే నాకు స్వాతంత్రం వచ్చిందని భావించా.. ప్రస్తుతం ప్రోటోకాల్ లేకపోవడంతో అందరినీ స్వేచ్ఛగా కలిగే కలిసే అవకాశం వచ్చిందన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణ అంకితభావం.. నీతి నిజాయితీ.. ఎంతో అవసరం. ప్రస్తుతం నాయకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నిత్యం పడుకునే ముందు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి తప్పులు చేశామని మననం చేసుకోవాలన్నారు.
చట్టసభల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ కలుగుతుందన్నారు వెంకయ్యనాయుడు. ఏదైనా విషయం మీద చర్చించాలి. అభిప్రాయాలు చెప్పాలే తప్ప వ్యక్తిగత దూషణలు.. విమర్శలకు దిగకూడదు.. దేశమంతా పర్యటించి నా అభిప్రాయాలను వెల్లడిస్తా. అన్ని పార్టీల నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో శత్రువులు ఉండరు..ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల నేతలు గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకుల ధోరణి మారితే ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిది. నెల్లూరు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సమయం ఉన్నప్పుడల్లా నెల్లూరుకు వచ్చి మిత్రులను, అభిమానులను కలుస్తూనే ఉంటానన్నారు వెంకయ్యనాయుడు.
Also Read
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
Read Also: Munugode History: మునుగోడులో గతంలో గెలిచింది ఎవరంటే?
గడపగడపకు ప్రభుత్వం మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు వెంకయ్యనాయుడు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎంత అవసరం. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావడం చాలా మంచిది. ప్రభుత్వ పథకాలలో అవినీతి జరగకుండా రాజకీయ నాయకులు.. దళారుల జోక్యం లేకుండా ఉండేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకాన్ని ప్రధాని మోడీ తీసుకువచ్చారన్నారు.

నెల్లూరులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆత్మీయ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడిని ఘనంగా సన్మానించారు ఓం బిర్లా. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. నెల్లూరులోని చిన్న గ్రామంలో జన్మించి దేశానికి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎదిగారు. రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు. క్రమశిక్షణ అంకితభావంతో పదవులను నిర్వహించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా విశేష సేవలు అందించారు. వెంకయ్య నాయుడుతో కలిసి సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. గురువు లాగా ఆయన రాజకీయ రంగంలో మాకు మార్గదర్శనం చేశారు.. స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
Read Also: Hyderabad Metro : ఇక నుంచి వాట్సప్లో కూడా టిక్కెట్ బుకింగ్.. ఎలాగంటే..?
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!