ఇసుక.. బంగారం కంటే విలువైందిగా మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పారుతున్నా ఇసుకకు ఇబ్బందులు తప్పడంలేదు. కొందరు ఇసుకను అక్రమంగా దాచేసి ఆంధ్ర సరిహద్దుల నుండి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమ నిల్వలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు, రాత్రివేళల్లో ట్రక్కుల కొద్దీ ఇసుక తరాలిపోవడాన్ని చూస్తే సరిహద్దుల్లో అధికారుల పనితీరు విస్మయానికి గురిచేస్తోంది, యటపాక మండలంలో కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో ఇసుకను తెలంగాణకు తరిస్తున్నారు,…
దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31,05,401గా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 5,24,093గా నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా…
సోమవారం ఏ రాశివారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి…? ఏ రాశివారు.. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది..? ఎవరు తమ పనులు వాయిదా వేసుకోవాలి…? ఎవరు ముందుకు వెళ్లాలి..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన రాశిఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Ri7p0-qx6jk
పొత్తులపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉంది. కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం.…
ఏపీలో ఇంకా ఎన్నికల మూడ్ రాకుండానే పొత్తుపొడుపులు ప్రారంభం అయ్యాయి. వైసీపీని ఓడించేందుకు ఇతర పార్టీలు కలిసి రావాలని ఈమధ్యే మాజీ సీఎం చంద్రబాబు వాకృచ్చారు. చంద్రబాబు కామెంట్లపై మండిపడ్డారు వైసీపీ నేతలు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సొంత పార్టీపై నమ్మకం లేదు. ప్రతీ ఎన్నికల సమయంలో అందుకే ఇతర పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారన్నారు బాలినేని. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నప్పుడే సీఎం జగన్ ఎదుర్కొనలేక పోతున్నారని…
జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అన్న సామెతను మనం వింటుంటాం కదా.. ఇప్పుడు ఈ..పెట్రోల్ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్ బంకు నిర్వాహకులు.. పెట్రోల్ ధరల దెబ్బకు ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే.. తెలంగాణలో…
ప్రభుత్వ దవాఖానాలంటే అవినీతికి రూపాలనే నానుడి వుంది. దానిని నిజం చేస్తున్నారు తిరుపతిలోని రుయా ఆస్పత్రి సిబ్బంది. ఈమధ్యే అంబులెన్స్ ల దందా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలకు కారణం అయింది. తాజాగా ఆస్పత్రికి వచ్చిన రోగుల్ని పీల్చిపిప్పిచేస్తున్నారు సిబ్బంది. వరుస ఘటనలు జరుగుతున్నా రుయా ఆసుపత్రి సిబ్బంది తీరు మారడం లేదు. తాజాగా డబ్బులు ఇస్తేనే తప్ప వైద్య సిబ్బంది సేవలు అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది రోగి బంధువు. ఆపరేషన్ కోసం రుయా…
* నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్న పవన్ * మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు *పుట్టపర్తిలో నేడు CPI కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ * గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా. *ఉదయగిరిలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి *ఆత్మకూరులో…
ఇదేదో సినిమా టైటిల్ కాదు. నిజంగా జరిగిన సంఘటన. 10వతరగతి అంటే నిండా 15 ఏళ్ళు కూడా నిండవు. పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు. కానీ అక్కడ అమ్మాయి, అబ్బాయి పదవతరగతి పూర్తికాకుండానే పెళ్ళి చేసుకోవాలని భావించారు. బాపట్ల జిల్లాలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్విజిలేటర్లకు షాక్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తైన వెంటనే పెళ్లి చేసుకునేందుకు రింగ్స్ తో వచ్చి ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చుండూరు…