Polavaram Project Virtual Meet: పోలవరంపై ముగిసిన నాలుగు రాష్ట్రాల వర్చువల్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరంపై నాలుగు రాష్ట్రాల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయించామని కేంద్రం పేర్కొంది. నివేదిక ఆధారంగానే చర్యలని స్పష్టీకరించింది. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేపట్టేందుకు సహకరించాలని పీపీఏ ఛైర్మన్ పేర్కొన్నారు. పీపీఏ ఛైర్మన్ ప్రతిపాదనలకు ఏపీ, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల అంగీకారం తెలిపింది. అయితే, సంయుక్త సర్వేకు నో ఒడిశా ప్రభుత్వం అంగీకరించలేదు. మళ్లీ వచ్చే నెల ఏడో తేదీన సాంకేతిక నిపుణులతో మరో భేటీ నిర్వహించనుంది జలశక్తి మంత్రిత్వ శాఖ.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
2009, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్ పై శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని వర్చువల్ సమావేశంలో కేంద్రజల శక్తి శాఖ తెలిపింది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని స్పష్టం చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా ఉండదని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనా ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది.
మరోమారు బ్యాక్ వాటర్ సర్వే చేయించాలని కోరింది తెలంగాణ. అయితే ఈ వాదనను తోసిపుచ్చింది కేంద్రం. గోదావరి ట్రిబ్యునల్ సిఫార్సుల మేరకు 36 లక్షల వరద జలాలు వెళ్లేలా స్పిల్ వే కట్టాలని ఉన్నా ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు పూర్తి అవుతున్నట్టు పేర్కొంది కేంద్రం. బ్యాక్ వాటర్ సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించింది. అక్టోబర్ 7వ తేదీన నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది జలశక్తి శాఖ.
Read Also: Tollywood: రిలీజైన రెండోవారంలోనే ఓటీటీలో! ఇక థియేటర్ కెందుకొస్తారు!?
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!