ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
ఉత్తరాంధ్ర విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర సాగిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. జలం కోసం – ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర ఈనెల 7వ తేదీ 9గంటలకు మొదలవుతుందన్నారు. త్రాగు , సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం మూడు రోజులు యాత్ర సాగిస్తామన్నారు. ఇప్పటికే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని, ముఖ్య అతిధిగా సునీల్…
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యాయానికి నాంది పలికారన్నారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పెద్ద పెద్ద సొరకాయలు కోస్తారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యింది?? కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. ఈ అంశాలు పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించటం లేదు. జనాభా పెరిగిపోతుంటే పాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు?? పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహాతో…
* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. *మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా. *నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును…
1.ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు? ఐదుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ..!దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది.…
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2…
టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని. కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను…
బాలయ్య. నటనను ప్రాణంగా ప్రేమిస్తారు. వయస్సు మీద పడినా.. హీరోయిజం చూపించే పాత్రలు చేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. నటనకు ఎంత ప్రయారిటీ ఇస్తారో.. జాతకాలు.. ముహూర్తాలు, దోషాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ముహూర్తం లేందే ఏ పనీ చేయరు. కాలు బయట పెట్టరు. ముహూర్తాలపై అంతలా నమ్మకం పెట్టే బాలయ్యకు పాపం.. PAల రూపంలో గండాలు ఎదురవుతున్నాయి. తలనొప్పులు తప్పడం లేదు. బాలకృష్ణకు కలిసిరాని PAలుబాలకృష్ణ.. సినిమాల్లో ఎంత పవర్ఫుల్ యాక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లోకి…
1.దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. 2.ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల…