Sajjala Ramakrishna Reddy: కేబినెట్ 2.Oతో మరో సామాజిక విప్లవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట వేశామన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాత కొత్తమేలు కలయికతో కేబినెట్ రూపొందించారన్నారు సజ్జల. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం రాబోతోందన్నారు.
చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం. 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ఇచ్చాం. 11 మంది ఓసీలకు మంత్రిపదవులు ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇన్ని మంత్రిపదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు 25కి 12 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మాత్రమే మంత్రిపదవులు ఎస్సీలకు ఇచ్చింది 3 మాత్రమే.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
చంద్రబాబు తొలి కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు చోటుదక్కలేదన్నారు. చంద్రబాబు రెండోసారి విస్తరించిన తర్వాత కూడా దిగిపోయేముందు మాత్రమే ఎస్టీకి 4 నెలలముందు ఎస్టీకి చంద్రబాబు ఇచ్చారు. 2019 తొలి కేబినెట్లో 5 మందికి డిప్యూటీసీఎంలు ఇచ్చాం. ఇందులో 4గురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే
చరిత్రలో ఉప్పుడూ కూడా ఇన్ని ఉపముఖ్యమంత్రి పదవులు ఈ వర్గాలకు ఇవ్వలేదు. దేశ సామాజిక న్యాయచరిత్రలోనే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం, నామినేటెడ్ వర్కుల్లో 50శాతం ఇచ్చిన తొలి ప్రభుత్వం వైయస్సార్సీపీదే అన్నారు. అందులోనూ యాభైశాతం మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా వైయస్.జగన్ ప్రభుత్వానిదే
ఏఎంసీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, గుడి ఛైర్మన్లు అన్నీకూడా ఒక చట్టంచేసి మరీ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 50శాతం ఇచ్చిన ప్రభుత్వం వైయస్.జగన్దే. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు ఇవికూడా చరిత్రాత్మకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. ఇప్పుడు ఆ విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్తున్న వైయస్.జగన్. పునర్వ్యవస్థీకరణద్వారా మంత్రిమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 17 మందికి చోటుకల్పించారు. మొత్తంగా 25 మందిలో ఈవర్గాలకు చెందిన 17 మందికి పదవులు లభించాయి. ఇందులో బీసీల ప్లస్ మైనార్టీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 మంత్రి కట్టబెట్టారన్నారు. అంటే మంత్రిమండలిలో 70 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చిన వైయస్.జగన్. సామాజిక న్యాయంలో మహావిప్లవం ఇది
ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు సజ్జల. 25 మందిలో ఓసీలు 8 మంది, బీసీలు 11 మంది ( ఒక్క మైనార్టీతో కలుపుకుని) ఎస్సీలు – 5, ఎస్టీ –1. 2019 కేబినెట్లో మహిళలకు 3 అయితే ఇప్పుడు 4కి పెంచారన్నారు.
చంద్రబాబు 2017లో మంత్రివర్గ విస్తరణను చూస్తే ఓసీలు 13, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు – 12 అంటే చంద్రబాబు హయాంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 12 కాస్తా.. 17కు పెంచాం. అంటే దాదాపు అప్పటికంటే.. 50శాతం పెంచాం. ఇదికాక గత మంత్రివర్గంలో 10 మందిని కొనసాగిస్తున్న వైయస్.జగన్ ఇందులో ఓసీలు, 2, ఎస్సీలు 3, బీసీలు 5గురు వున్నారన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యులకు ఇవ్వాలని నిర్ణయం. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నామన్నారు. ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ పదవి బ్రాహ్మణుల వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. శాసనసభలో చీఫ్విప్గా క్షత్రియ వర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజుకు ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు సజ్జల.
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..