Kondepi Tension: ఎమ్మెల్యే ఇంటిముట్టడి యత్నం.. వివాదాస్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 1734 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని నిన్న కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై మంత్రి బాలినేని స్పందించలేదు. అయితే కొండపి వైసీపీ నాయకుడు అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయింది.
Also Read
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
టంగుటూరు నుండి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి బయలు దేరాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మార్గ మధ్యంలో అశోక్ బాబుని అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించడంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇరువురి మధ్య తోపులాటతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తోపులాటలో అశోక్ బాబు స్పృహతప్పి పడిపోవడంతో వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు.
వైసీపీ నేత అశోక్ బాబు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తే చీర, గాజులు పెడతామంటూ నినాదాలు చేశారు. తమ పార్టీ మంత్రిపై ఆరోపణలు చేసినందుకే ఎమ్మెల్యే స్వామి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించానని అశోక్ బాబు చెబుతున్నారు. ఇరుపార్టీల కార్యకర్తల మోహరింపుతో టంగుటూరు, నాయుడుపాలెం గ్రామాల్లో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి యత్నించిన వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!