Kondepi Tension: ఎమ్మెల్యే ఇంటిముట్టడి యత్నం.. వివాదాస్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 1734 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని నిన్న కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై మంత్రి బాలినేని స్పందించలేదు. అయితే కొండపి వైసీపీ నాయకుడు అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయింది.
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
టంగుటూరు నుండి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి బయలు దేరాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మార్గ మధ్యంలో అశోక్ బాబుని అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించడంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇరువురి మధ్య తోపులాటతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తోపులాటలో అశోక్ బాబు స్పృహతప్పి పడిపోవడంతో వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు.
వైసీపీ నేత అశోక్ బాబు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తే చీర, గాజులు పెడతామంటూ నినాదాలు చేశారు. తమ పార్టీ మంత్రిపై ఆరోపణలు చేసినందుకే ఎమ్మెల్యే స్వామి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించానని అశోక్ బాబు చెబుతున్నారు. ఇరుపార్టీల కార్యకర్తల మోహరింపుతో టంగుటూరు, నాయుడుపాలెం గ్రామాల్లో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి యత్నించిన వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!