Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Andhra Pradesh High Court Issues Notices To Alliance Government Over Free Land Allocation To Adani Data Center

High Court: సర్కార్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం..

Published Date :February 4, 2026 , 2:33 pm
By Sudhakar Ravula
High Court: సర్కార్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

High Court: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విశాఖపట్నం సమీపంలోని అడవి వరం, ముడసరిలోవ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న అదానీ డేటా సెంటర్‌కు సంబంధించిన భూ కేటాయింపుల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లాలో సుమారు 480 ఎకరాల ప్రభుత్వ భూమిని, సుమారు రూ.5,000 కోట్ల విలువైన భూమిని, అదానీ గ్రూప్‌కు చెందిన రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఉచితంగా కేటాయించడాన్ని సవాలు చేస్తూ అనకాపల్లి జిల్లాకు చెందిన జై భీమ్ భారత్ పార్టీ (JBP) జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

Read Also: KTR: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ.. ఇది రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు..

ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలు కీలక ప్రశ్నలు సంధించింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 40 (తేదీ 11-10-2025) ద్వారా భూమితో పాటు రూ.1000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిందని, అనంతరం జీవో ఎంఎస్ నెంబర్ 66 (తేదీ 02-12-2025) ద్వారా 480 ఎకరాల భూమిని తక్షణమే బదలాయించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం కంపెనీలకు భూమిని ఉచితంగా బదలాయించే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 117 (తేదీ 09-11-2023) ప్రకారం భూమిని కేవలం లీజు పద్ధతిలో మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉందని తెలిపారు.

ఇక, పరిశ్రమ పూర్తయ్యాకే భూ బదలాయింపు జరగాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ముందుగానే సేల్ డీడ్ రాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం భూమిపై తన పూర్తి హక్కులను కోల్పోతుందని న్యాయవాది హెచ్చరించారు. ఒకసారి సేల్ డీడ్ రాసి ఇస్తే, ప్రాజెక్టు పూర్తికాకపోయినా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉండదని వాదించారు. ఈ నేపథ్యంలో, ఏ పాలసీ ఆధారంగా భూమిని ఉచితంగా బదలాయిస్తున్నారు?, ఈ జీవోల ప్రకారం ఇప్పటికే సేల్ డీడ్‌లు రాశారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భూ బదలాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన న్యాయస్థానం, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రంలో భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 480 acres government land
  • Adani Data Center Visakhapatnam
  • Adani infrastructure Andhra Pradesh
  • Adani land allotment controversy
  • Alliance government setback

తాజావార్తలు

  • Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..

  • Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు

  • Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

  • Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

  • Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions