AP High Court: సర్కార్పై హైకోర్టు సీరియస్.. ఏంటి ఈ నిర్లక్ష్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. గిరిజన ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని 595 గ్రామపంచాయతీలకు చెందిన 878 రెవెన్యూ గ్రామాల జాబితా ఇప్పటికీ అధికారిక వెబ్సైట్లో ప్రచురించకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ జాబితాను సరిహద్దులతో సహా వెంటనే గిరిజన సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
అయితే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఇప్పటికే ఈ 878 రెవెన్యూ గ్రామాల జాబితాను సిద్ధం చేసినప్పటికీ, దానిని అధికారికంగా ప్రచురించడం లేదని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి. వెంకట శివరాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. జాబితా అందుబాటులో లేకపోవడంతో గిరిజన యువత, పేద కుటుంబాలు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందలేకపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని గిరిజనేతరులు షెడ్యూల్ ప్రాంతాల్లో సారవంతమైన భూములను ఆక్రమించడం, అక్రమ మైనింగ్, వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. షెడ్యూల్డ్ ఏరియాలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల గిరిజనులకు రావాల్సిన భూములు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 878 రెవెన్యూ గ్రామాల పూర్తి వివరాలను వెంటనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.
తాజావార్తలు
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?