AP High Court: అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా..?
- విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం..
- మాంసం, చేపల దుకాణాలకు కూడా ఈ వేలంపై విచారణ..
- అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు..
- క్షేత్రస్థాయి పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంసం, చేపల దుకాణాల కేటాయింపుకు చేపట్టిన ఈ-వేలం విధానంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు తీవ్రంగా మండిపడింది. చిరు వ్యాపారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి అన్న అవగాహన వారికి ఎలా ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. చాలామంది చిరు వ్యాపారులు చదువు రాని వారే ఉంటారని, అలాంటి వారు ఈ-వేలంలో ఎలా పాల్గొంటారని కోర్టు ప్రశ్నలు సంధించింది.
Read Also: AP Liquor Scam Case: చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
సాంప్రదాయ బహిరంగ వేలం విధానమే చిరు వ్యాపారులకు అనుకూలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీ రూముల్లో కూర్చుని తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజల సమస్యలను గమనించకుండా యాంత్రికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దుకాణాల కేటాయింపుకు సంబంధించి జారీ చేసిన ఈ-వేలం నోటిఫికేషన్ అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్