ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం.. అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు..
Tesla : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానసపుత్రిక టెస్లా ఇప్పుడు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది.
గ్రూప్-2 పరీక్షల్లో పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి..
తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ..
సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది..
టీటీడీ పాలకమండలి సభ్యుడు.. ఉద్యోగి మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. మూడు రోజులు క్రితం మహాద్వారం గేటు తెరిచే అంశంపై పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్... టీటీడీ ఉద్యోగి బాలాజీ మధ్య తలెత్తిన వివాదానికి ఉద్యోగ సంఘ నేతలు ముగింపు పలికారు.
గుంటూరులో ఉచితంగా చికెన్ పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. బర్డ్ ఫ్లూ వదంతులతో పడిపోయిన చికెన్ అమ్మకాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు సిద్ధమయ్యారు.. నష్టాల పాలైన నేపథ్యంలో, పౌల్ట్రీ పరిశ్రమకు మద్దతుగా రంగంలోకి దిగి చికెన్ తినాలంటున్న ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు..
మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు.
పెట్రో ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. విజయవాడలో కేంద్ర బడ్జెట్ అవగాహన సమావేశానికి హాజరైన ఆయన.. ముందుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో కలిసానన్నారు.. ట్రంప్ తన మార్క్ చూపించాలనుకున్నాడున్నారు.. అలాగే పెట్రోలియం రేట్లు మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో తగ్గాయన్నారు.. ఢిల్లీలో బీజేపీ సర్కార్ వచ్చింది.. బీహార్ లో కూడా…