Minister BC Janardhan Reddy: యాగంటికి భక్తుల తాకిడి.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు..
- యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ..
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతుల ప్రత్యేక పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు, ఆలయ సంప్రదాయబద్ధంగా తలపాగా ధరించిన మంత్రి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో తలపై ఉంచుకొని ఉమా మహేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు.. ఏకశిలపై కొలువున్న ఉమామహేశ్వరులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు విశేష అభిషేక ప్రత్యేక పూజలను నిర్వహించారు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఉదయం 5 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన, సహస్రనామావళి, వంటి విశేష పూజలను, వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు, నేటి అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భావ కాల ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
Read Also: Crime News: పండుగ పూట విషాదం.. వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని సూసైడ్!
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
ఇక, యాగంటిలో స్వామి అమ్మ వారిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు క్యూలైన్ల లో నిలిచి ఉన్నారు, స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు గంటల సమయం పడుతున్నట్లు భక్తులు వెల్లడించారు. మరోవైపు.. ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. స్వామి అమ్మ వారి సన్నిధిలో తాను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఉమామహేశ్వరులు, అనుగ్రహించాలని కోరుకున్నట్లు వెల్లడించారు, మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజావార్తలు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!