MLC Elections 2025: ఏపీలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పగడ్బందీగా ఏర్పాట్లు..
- ఏపీలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు..
- మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్..
- రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్..
- ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటించిన ఎన్నికల సంఘం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మోడ్లోకి వెళ్లింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు… రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల పరిధిలోని ఉద్యోగులకు ఎన్నికల సంఘం క్యాజువల్ లీవ్ను ప్రకటించింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 22,493 మంది ఓటర్లు ఉన్నారు. 13,503 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఎన్నిక జరుగుతోంది. యుటీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి, ఏపీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులనాయుడు పోటీ చేస్తున్నారు.
Read Also: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీపై మరో ఫిర్యాదు
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,14,984 ఓట్లు ఉంటే.. 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మహిళలు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,46,529 ఓట్లు ఉన్నాయి. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీపై మరో ఫిర్యాదు
మరోవైపు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పగడ్బందీగా జరుగుతున్నాయి.. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి పోలింగ్ మెటీరియల్ పంపిణీ మరి కాసేపట్లో జరగనుంది.. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆరు జిల్లాలకు మెటీరియల్ పంపిణీకి ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికను నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని ఆ దిశగా పట్టిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.. ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న ఆరు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు.. మూడు జిల్లాల పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు… ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు… అత్యధికంగా విశాఖలో ఓటర్లు 5529 ఉండగా అత్యలపంగా అల్లూరు జిల్లాలో 1488 మంది ఓటర్లు ఉన్నారు..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!