ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని కొట్టారు. ఈ వ్యూహం నాడు సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ఇదే ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.…
ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయ్.తూర్పుమధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాగల 24…
సినీ ప్రియులు, థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇవాళ విడుదల కానున్న మహా సముద్రంతో…
సాధారణంగా పండుగ రోజుల్లో చికెన్ ధరలు పెరుగుతుంటాయి. కరోనా సమయం కాబట్టి పోషకాహారానికి డిమాండ్ పెరిగింది. పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండోచ్చని న్యూట్రీషియన్స్ చెప్పడంతో చికెన్కు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. చికెన్కు డిమాండ్ పెరగడంతో కోళ్ల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టారు. దసరా పండుగ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో చికెన్ కు దూరంగా ఉంటారు. దీంతో కోడి మాంసం వినియోగం తగ్గిపోయింది. కావాల్సన్ని కోళ్లు అందుబాటులో ఉన్నా, కోనుగోలు లేకపోవడంతో…
ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారని అనుమానం వచ్చిందా? వస్తాం అనగానే వచ్చేయ్యండని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? ఇంట్లోనే కట్టేసుకోవాలని చూస్తోందా? బీజేపీతో ముగ్గురు ఎంపీలు అంటీముట్టనట్టు ఉంటున్నారా? సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే టీడీపీలో ఓ వెలుగు వెలిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టి.జి. వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకుందో… లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ……
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమలకు రానున్నారు చీఫ్ జస్టిస్… మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఆయన.. ఆ తర్వాత తిరుచానూరుకు వెళ్లనున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి తిరుమలకు చేరుకుంటారు.. ఇక, ఎల్లుండి (శుక్రవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా కూడా తిరుమలకు…
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా?..’ అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు. ఐటీని తామే ప్రవేశపెట్టమని.. సాంకేతికతకు తామే ఆద్యులమని చెప్పుకునే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నారన్న టాక్ నడుస్తోంది.. సాంకేతిక ప్రవేశపెట్టడం కాదు.. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ వారిపై…
మొత్తానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం థియేటర్ల ఆక్యుపెన్సీని నూరుశాతానికి పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 14వ తేదీ నుండే అమలు కాబోతోంది. దాంతో రేపు విడుదల కాబోతున్న ‘మహా సముద్రం’ చిత్రంతో పాటు ఎల్లుండి, 15వ తేదీ జనం ముందుకు రాబోతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘పెళ్ళిసందడి’ చిత్రాలకు బోలెడంత మేలు చేసినట్టు అయ్యింది. పైగా కర్ఫ్యూ సమయాన్ని సైతం అర్థరాత్రి 12 గంటల నుండి ఉదయం…
కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చింది.. అయితే, నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతూనే ఉంది… తాజాగా మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం… ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది… అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కోవిడ్ ఆంక్షల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ అమల్లో…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్.…