KCR : నా దాడి తట్టుకోలేక చంద్రబాబు మోకాళ్ళ మీద పరిగెత్తి మరీ కట్టిండు
- పాలమూరుపై ఉమ్మడి పాలకుల ఘోర వివక్ష
- జూరాల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు
- దత్తత పేరుతో ద్రోహం.. చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్
- వలసల గోసే తెలంగాణ ఉద్యమానికి నాంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జిల్లా సాగునీటి కష్టాలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ, జిల్లా ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం అలమటించారని, పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ గుర్తించినా.. పాలకుల నిర్లక్ష్యం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బచావత్ కూడా పాలమూరు జిల్లా దుర్భర పరిస్థితిని చూసి చలించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో పాలమూరు గురించి గంటెడు నీళ్లు అడిగే నాథుడే లేడని, అందుకే ట్రిబ్యునల్ స్వయంగా స్పందించి జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీల నీటిని కేటాయించిందని చెప్పారు. అయితే, 1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ, ఉమ్మడి పాలకులు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దశాబ్దాల పాటు కాలువలు లేక జూరాల ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
దత్తత తీసుకుని ద్రోహం చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. “మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నాను” అని ప్రకటించిన చంద్రబాబు, కేవలం పునాది రాళ్లు వేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు రాళ్లు వేశారే తప్ప, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కర్ణాటకకు చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించలేదని, తాను ఉద్యమ సమయంలో చేసిన పోరాటం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
వలసల గోస – ఉద్యమ బాట సాగునీరు లేక జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి బొంబాయికి బస్సులు ఉండేవని, జిల్లా మొత్తం కరువు కోరల్లో చిక్కుకుందని కేసీఆర్ వివరించారు. గోరేటి వెంకన్న గారు రాసిన “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” అనే పాట జిల్లా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టిందని చెప్పారు. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తాను జోగులాంబ నుండి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టానని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..