KCR : నా దాడి తట్టుకోలేక చంద్రబాబు మోకాళ్ళ మీద పరిగెత్తి మరీ కట్టిండు
- పాలమూరుపై ఉమ్మడి పాలకుల ఘోర వివక్ష
- జూరాల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు
- దత్తత పేరుతో ద్రోహం.. చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్
- వలసల గోసే తెలంగాణ ఉద్యమానికి నాంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జిల్లా సాగునీటి కష్టాలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ, జిల్లా ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం అలమటించారని, పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ గుర్తించినా.. పాలకుల నిర్లక్ష్యం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బచావత్ కూడా పాలమూరు జిల్లా దుర్భర పరిస్థితిని చూసి చలించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో పాలమూరు గురించి గంటెడు నీళ్లు అడిగే నాథుడే లేడని, అందుకే ట్రిబ్యునల్ స్వయంగా స్పందించి జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీల నీటిని కేటాయించిందని చెప్పారు. అయితే, 1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ, ఉమ్మడి పాలకులు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దశాబ్దాల పాటు కాలువలు లేక జూరాల ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
దత్తత తీసుకుని ద్రోహం చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. “మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నాను” అని ప్రకటించిన చంద్రబాబు, కేవలం పునాది రాళ్లు వేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు రాళ్లు వేశారే తప్ప, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కర్ణాటకకు చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించలేదని, తాను ఉద్యమ సమయంలో చేసిన పోరాటం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
వలసల గోస – ఉద్యమ బాట సాగునీరు లేక జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి బొంబాయికి బస్సులు ఉండేవని, జిల్లా మొత్తం కరువు కోరల్లో చిక్కుకుందని కేసీఆర్ వివరించారు. గోరేటి వెంకన్న గారు రాసిన “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” అనే పాట జిల్లా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టిందని చెప్పారు. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తాను జోగులాంబ నుండి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టానని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!