Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
మున్సిపల్ రిజల్ట్స్ : ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన కు బిగ్ షాక్.. !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పూర్తిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోలహలం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్ల ఫలితాల్లో వైసీపీ పార్టీ దుమ్ము దులుపుతోంది. దర్శి మినహా దాదాపు అన్ని మున్సిపాలటీలు వైసీపీ కైవసం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే..ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంటే… ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. బుగ్గన రాజేంద్ర నాథ్ నివాసం ఉండే 15 వ వార్డులో వైసీపీ పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ తరఫున… -
వైసీపీ గెలిచిన సంతోషంలో వెలిగిపోయిన రోజా ముఖం !
కుప్పం మున్సిపాలటీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి… వైసీపీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విజయం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా వైసీపీ గెలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ఏ ఎన్నికలు వచ్చిన వార్ వన్ సైడేనని… నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబు తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. కుప్పంలోనే ఇల్లు… -
కొండపల్లిలో కీలకంగా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి
కృష్ణా జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 వార్డులకు 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, 14 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు సొంతం చేసుకున్నాడు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. Read Also: దర్శిలో టీడీపీ విజయ… -
ఏ ఎన్నికలైనా వార్ వన్ సైడే.. బాబు, లోకేష్ తట్టాబుట్టా సర్దుకోవాలి..!
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని… -
ఇక చంద్రబాబు తప్పుకోవాలి.. టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలి..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో… -
ఇది సీఎం జగన్ ప్రభంజనం.. టీడీపీ ఆఫీసు ఇక అద్దెకే..!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. టీడీపీ అధినేత నియోజకవర్గంలోని కుప్పంలో కూడా వైపీపీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం.. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు.. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే… -
ఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు..
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో.. వెంటనే ఆయనను చికిత్స కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బిశ్వభూషన్.. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే, ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి..? ప్రస్తుతం ఎలా ఉన్నారు.. ఏ చికిత్స జరుగుతోంది..? లాంటి విషయాలు మాత్రం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలియనున్నాయి. ఆయన… -
సెంచరీ కొట్టిన టమాటా ధర..
ఏ కూరలోనైనా టమాటా ఉండాల్సిందే.. ఉల్లి గడ్డతో పాటు టమాటాకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.. అయితే, టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. గత నెలలో గరిష్ఠంగా కిలో 30 రూపాయలు పలికిన టమాటా ధర.. బహిరంగ మార్కెట్లో 40 రూపాయల వరకు అమ్ముడు పోయింది.. అయితే, వర్షాలతో టమాటా పంట దెబ్బతినడంతో.. మార్కెట్కు వచ్చే పంట కూడా తగ్గిపోయింది.. దీంతో టమాటా ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. Read Also: తన జన్మదిన వేడుకల్లో… -
ఏపీ కేబినెట్ వాయిదా
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే రేపు (బుధవారం) రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం.. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే.. కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి.… -
నరసాపురం పర్యటనకు సిద్ధమైన జనసేనాని
అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇప్పటికే గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు.. ఇక, ఈ మధ్యే విశాఖలో పర్యటించిన జనసేనాని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు.. అయితే, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.. ఈ నెల 21న నరసాపురంలో పర్యటించనున్నారు..…
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!