Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..
- పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుంది
- మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తాను
- గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాను
- డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుంది
- బీఆర్ఎస్తో నా ఇష్యూను కాంగ్రెస్, సీఎం రేవంత్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. -కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత, తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీ అజెండాపై ప్రస్తుతం లోతైన కసరత్తు జరుగుతోందని కవిత వెల్లడించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని తాను లోతుగా అధ్యయనం చేస్తున్నానని, అదే అజెండాతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరును, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ఇప్పటికే పార్టీ పేరు విషయంలో అన్నీ సెట్ అవుతున్నాయని, కార్యాలయం కోసం స్థలాన్ని కూడా అన్వేషిస్తున్నామని ఆమె వివరించారు.
Panchanga Sravanam: సీఎం రేవంత్రెడ్డికి పాలన పరంగా ఇబ్బందులు లేవు.. గాంధీ భవన్ పంచాంగ శ్రవణం
Also Read
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
తన రాజకీయ పోరాటం ఎవరితో ఉండబోతోందో కవిత సూటిగా చెప్పారు. డాడీ, మోడీ, చిన్న మోడీ పైనే తన పోరాటం ఉంటుందని ఆమె ప్రకటించారు. తనకు ఎవరితోనూ రాజీ లేదని, తన కొత్త పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ , సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
Nitish Kumar: బీహార్ కొత్త ముఖ్యమంత్రి పేరుపై నితీష్ కుమార్ సంకేతాలు!.. భగ్గుమంటున్న జేడీయూ నేతలు!
శ్రీరామనవమి తర్వాత పార్టీ ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని కవిత తెలిపారు. చాలా మంది జాతీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు కూడగడతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువతకు తన పార్టీలో పెద్దపీట వేస్తానని ప్రకటించారు. తనకు ఎలాంటి బేషజాలు లేవని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నూతన పార్టీ ప్రభావం ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఆమె విశ్లేషించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా చాలా చోట్ల నుంచి తనను పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని, రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!