వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఈసీని కలిసిన టీడీపీ ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సోమవారం సాయంత్రం లోక్సభ టీడీపీ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వైఎస్ఆర్సీపీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ వైసీపీ దాడులు చేయిస్తోందని, బూతులు తిట్టిస్తోందని ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
Read Also: ఏపీలో ఓటర్ల జాబితా విడుదల.. తూ.గో. జిల్లా ఫస్ట్
Also Read
మరోవైపు 12 కేసుల్లో ఛార్జిషీట్లను ఎదుర్కొంటున్న జగన్ జైలుకు వెళ్లి బెయిల్పై బయట ఉన్నారని, ఆయనకు ఓ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదని ఈసీ దృష్టికి టీడీపీ ఎంపీలు తీసుకెళ్లారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని గట్టిగా కోరామని, తమ విజ్ఞప్తిని లోతుగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ తమకు హామీ ఇచ్చిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. కాగా ఇటీవల వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరగా.. ఇప్పుడు కౌంటర్గా టీడీపీ ఎంపీలు ఈసీని కలిసి వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!