పీఆర్సీ పై ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటన చేశారు. పీఆర్సీ నివేదికపై అధ్యయనంపై అధికారుల కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయ్యామని.. తమ సూచనలను సీఎం జగన్ కు నివేదించామని వెల్లడించారు. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలని.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలని.. 2 అంశాలు అమలు చేయనక్కర్లేదని సూచించామని సీఎస్ పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటారన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సచివాలయ…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 21010 శాంపిల్స్ను పరీక్షించగా.. 108 మందికి కరోనా పాజిటివ్గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందరు. ఇదే సమయంలో 141 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,98,406 కు…
కోవిడ్, వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోగా అందరికీ డబుల్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణలో ఉన్న పరిష్కారమని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయం అందరికీ అవాగాహన కల్పించాలని… గ్రామ సచివాలయాల్లో సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలని వెల్లడించారు. విలేజ్…
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆయన పిటిషన్ను అనుమతించిన హైకోర్టు.. ఇవాళే విచారణ చేపట్టే అవకాశం ఉంది… కాగా.. తన నివాసంలో ఏపీ సీఐడీ సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…
చంద్రబాబుకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహారిస్తే కనీస గౌరవం దక్కుతుంది అని సూచించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్ 4 అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ జగన్ పాలనపై ప్రతిపక్షాలకు పిచ్చి ఎక్కి విమర్శలు చేస్తున్నాయి అని తెలిపారు. ఓటీఎస్ పేద ప్రజలకు ఓ వరం అని చెప్పిన రోజా… చంద్రబాబు 14 ఏళ్ళు…
ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే కర్నూలు మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులపై దాడిపై ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బేతాలలో కేఈ ప్రభాకర్, కోట్ల సుజాత, గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, తిక్కా రెడ్డి ఉన్నారు. అయితే టీడీపీ నేత తిక్కారెడ్డి పై మూడు సార్లు దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అక్రమాలను అరాచకాలను అడ్డుకుంటున్నందుకే తమ పై దాడి…
తిరుపతి రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అడుగడుగున పూలవర్షం కురిపించి వారిని స్వాగతించారు. అయితే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రను గత నెల 1వ తేదీన ప్రారంభించారు. ఈరోజు వారు రేణిగుంటకు చేరుకున్నారు. అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ గల్లా జయదేవ్, రైతు జేఏసీ నాయకులు. బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నడిచారు బీజేపీ శ్రేణులు. అంబేద్కర్…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని…
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, నోటీసు వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లోకి ప్రవేశించింది.. క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.. ఆంధ్రప్రదేశ్లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు లేకపోయినా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్…