ఏపీలో వైఎస్ షర్మిల పార్టీ..? మేమంతా ఒక్కటే అంటున్న ఏపీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ పెడతారా? అంటూ ఎదురైన ప్రశ్నపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు.. ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఎదురుప్రశ్నించిన కాకరేపారు వైఎస్ షర్మిల.. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి స్పందించారు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు.. కానీ, ఏపీలో పార్టీ పెడతామని చెప్పలేదన్నారు.. వైఎస్ షర్మిల.. ఏపీలో పార్టీ పెడతారని అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. షర్మిలమ్మ మేం అంతా వైయస్సార్ కుటుంబం.. మేమంతా ఒక్కటేనని స్పష్టం చేశారు.
Read Also: కేసీఆర్ నిజంగా అవినీతి చేస్తే బయటపెట్టరే..! ఇదో డ్రామానా..?
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ఇక, చంద్రబాబు చేసిన విద్యుత్ బకాయిలు కూడా ఇప్పుడు తీరుస్తున్నాం అన్నారు మంత్రి బాలినేని.. చంద్రబాబు పోలవరంలో ఏమి చేసారో అందరికీ తెలుసన్న ఆయన.. రాజధానికి ఆయన చేసిందేమీ లేదు.. అందుకే ఓడి పోయారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబులా సీఎం వైఎస్ జగన్ ఎవరిని యాచించే వ్యక్తి కాదన్న బాలినేని.. రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అంటూ బాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చుట్టూ తిరిగాడు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టామని ఎన్టీఆర్ చెబితే అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. జగన్, కాంగ్రెస్ తో కలిస్తే కేసులు మాఫీ చేసేవారు.. కేంద్రంలో ఉన్న సోనియాను కూడా జగన్ ఎదిరించి పార్టీ పెట్టారని.. చంద్రబాబుపై ఏమైనా కేసులు పెడితే ఏదోలా స్టే తెచ్చుకుంటారు.. సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే కేసుల మాఫీ కోసం వెళ్లారంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 29 సార్లు ప్రధానిని ఎందుకు కలిశారు? అని నిలదీసిన మంత్రి బాలినేని.. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయింది.. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మూడు లక్షల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చారా..? అంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?