రాష్ట్ర విభజన కంటే జగన్ చేసిన డ్యామేజే ఎక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్కి మందుందేమో కానీ.. జగన్ వైరస్కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్మెంట్ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఇది, చెత్త పన్ను కట్టకుంటే ఇంటి ముందు చెత్త వేయమని ఓ మహా నాయకుడు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లే కాదు ఆస్తి కల్పించిన ఘనత టీడీపీదేనన్న బాబు.. టీడీపీ ఇచ్చిన రూ. 2 వేల పెన్షన్ను కూడా తామే ఇచ్చామని జగన్ సిగ్గు లేకుండా చెబుతున్నారని ఫైర్ అయ్యారు.. టీడీపీ అధికారంలోకి వచ్చుంటే ఇప్పుడు రూ. 3 వేల ఫించన్ ఇచ్చేవాళ్లం అన్నారు.
Read Also: తెలంగాణలో భూప్రకంపనలు.. ఆ 2 జిల్లాల్లో పరుగులు పెట్టిన ప్రజలు..!
Also Read
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
విద్యా వ్యవస్థ విషయంలో జగన్ దూరదృష్టి లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు.. టీచర్ల నియామకం చేయకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేశారు.. ఇప్పుడు ఏపీలో పేదలకు విద్య అందని పరిస్థితి నెలకొంది.. వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుకోవాలా..? పేదలకు విద్య అందకూడదా..? అని నిలదీశారు. ఇక, ఒక్క రోజులోనే రూ. 124 కోట్ల మద్యం తాగేశారు.. మద్యం ముడుపులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకే మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్ల వ్యవస్థని పెట్టలేదని ఆరోపించారు చంద్రబాబు.. కాంట్రాక్టర్లంతా రోడ్ల మీద పడిన పరిస్థితి నెలకొందన్న ఆయన.. కోవిడ్ ఇబ్బందితో పాటు.. వైసీపీ గ్రహణం కారణంగా రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతోందన్నారు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే.. వేదిక పైనున్న వారిలో షరీఫ్ మినహా ప్రతి ఒక్కరి పైనా కేసులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫ్ ఇటీవల వరకు మండలి ఛైర్మన్ పదవిలో ఉన్నారు కాబట్టి కేసుల్లేవనుకుంటా అని వ్యాఖ్యానించారు. పార్లమెంటైనా జరుగుతోంది కానీ.. అసెంబ్లీ జరగడం లేదని సెటైర్లు వేసిన చంద్రబాబు.. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారని.. న్యాయ వ్యవస్థ పైనా గతంలో ఎవ్వరూ చేయని విధంగా విమర్శలు చేశారని మండిపడ్డారు. టీడీపీకి సమస్యలు కొత్త కాదు.. కానీ ఇప్పుడున్న సవాళ్లు మాత్రం గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని.. ఎంతో మంది సీఎంలు వచ్చారు.. కానీ ఎవరూ డామేజ్ చేయని విధంగా జగన్ రాష్ట్రాన్ని డామేజ్ చేశారన్నారు.
తాజావార్తలు
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!