Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!
- టీఎంసీ తొలి జాబితా విడుదల
- జాబితాలో ముఖ్యమంత్రి మమత
- మమత ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 294 స్థానాలకు గాను 291 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. సువేందు అధికారిని భబానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల నుంచి పోటీకి దింపింది. గతంలో నందిగ్రామ్లో సువేందు అధికారిపై మమత ఓటమి చెందారు. ప్రస్తుతం మమత భబానీపూర్ నుంచి బరిలోకి దిగారు. ఈసారి భబానీపూర్ నుంచే పోటీ చేస్తారా? మరొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అన్నది సస్పెన్ష్గా ఉంది.
ఇది కూడా చదవండి: Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 152, 142 స్థానాలకు రెండు దశల వారీగా పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం మే 4న జరగనుంది.
ఇక అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభ్యర్థుల జాబితాను ప్రకటించే ముందు నేను బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను బీజేపీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరెందుకు భయపడుతున్నారు? మీరు పోరాడాలనుకుంటే గ్యాస్ సంక్షోభం సృష్టించకండి. సరైన పద్ధతిలో క్షేత్రస్థాయికి రండి. ఎన్నికల సంఘం, మీరు ఒక అద్భుతమైన ఆట ఆడారు. బీజేపీకి అవకాశం లేదు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం మీకు సీట్లు తగ్గుతాయి. ఇది పశ్చిమ బెంగాల్ అస్తిత్వ పోరాటం. బెంగాల్ గెలుస్తుంది. ‘‘ఢిల్లీ కా లడ్డూ’’ గెలవదు.’’ అంటూ మమత వ్యాఖ్యానించారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను సువేందు అధికారి ఓడించారు. మరోసారి సువేందు అధికారిని నందిగ్రామ్, భబానీపూర్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది. బీజేపీ తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులను ప్రకటించింది.
West Bengal | TMC announces names of candidates for 291 assembly seats
Voting for all 294 assembly seats in West Bengal will be held in two phases – on April 23 and 29 – with 152 and 142 seats going to polls, respectively. Counting of votes will take place on May 4. pic.twitter.com/235IbTGpwO
— ANI (@ANI) March 17, 2026
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!