Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!
- టీఎంసీ తొలి జాబితా విడుదల
- జాబితాలో ముఖ్యమంత్రి మమత
- మమత ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 294 స్థానాలకు గాను 291 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. సువేందు అధికారిని భబానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల నుంచి పోటీకి దింపింది. గతంలో నందిగ్రామ్లో సువేందు అధికారిపై మమత ఓటమి చెందారు. ప్రస్తుతం మమత భబానీపూర్ నుంచి బరిలోకి దిగారు. ఈసారి భబానీపూర్ నుంచే పోటీ చేస్తారా? మరొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అన్నది సస్పెన్ష్గా ఉంది.
ఇది కూడా చదవండి: Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 152, 142 స్థానాలకు రెండు దశల వారీగా పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం మే 4న జరగనుంది.
ఇక అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభ్యర్థుల జాబితాను ప్రకటించే ముందు నేను బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను బీజేపీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరెందుకు భయపడుతున్నారు? మీరు పోరాడాలనుకుంటే గ్యాస్ సంక్షోభం సృష్టించకండి. సరైన పద్ధతిలో క్షేత్రస్థాయికి రండి. ఎన్నికల సంఘం, మీరు ఒక అద్భుతమైన ఆట ఆడారు. బీజేపీకి అవకాశం లేదు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం మీకు సీట్లు తగ్గుతాయి. ఇది పశ్చిమ బెంగాల్ అస్తిత్వ పోరాటం. బెంగాల్ గెలుస్తుంది. ‘‘ఢిల్లీ కా లడ్డూ’’ గెలవదు.’’ అంటూ మమత వ్యాఖ్యానించారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను సువేందు అధికారి ఓడించారు. మరోసారి సువేందు అధికారిని నందిగ్రామ్, భబానీపూర్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది. బీజేపీ తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులను ప్రకటించింది.
West Bengal | TMC announces names of candidates for 291 assembly seats
Voting for all 294 assembly seats in West Bengal will be held in two phases – on April 23 and 29 – with 152 and 142 seats going to polls, respectively. Counting of votes will take place on May 4. pic.twitter.com/235IbTGpwO
— ANI (@ANI) March 17, 2026
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..