Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్స్పెక్టర్
- మూడబిద్రి ఇన్స్పెక్టర్పై సంచలన ఆరోపణలు
- బ్లాక్మెయిల్, లైంగిక వేధింపుల ఆరోపణలు
- మైనర్ బాలికపై కన్నేసినట్లు ఆరోపణలు
- విచారణకు ఆదేశాలు, పోలీస్ శాఖ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Se*xual Harassment : శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, తన వద్దకు న్యాయం కోసం వచ్చిన మహిళలనే లైంగికంగా వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. మంగళూరు కమిషనరేట్ పరిధిలోని మూడబిద్రి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సందేష్ పి.జి.పై ఒక మహిళ చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీస్ శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
వివరాల ప్రకారం.. ఒక కుటుంబ కలహాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఇన్స్పెక్టర్ సందేష్ టార్గెట్ చేశాడు. ఆమె భర్తను కేసులో ఇరికించి, అతన్ని విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షల డబ్బు ఇవ్వాలని లేదా తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పోస్టింగ్ కోసం హోం మంత్రికి రూ. 50 లక్షలు ఇచ్చి వచ్చానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన గర్వంగా చెప్పుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు.
ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, సదరు మహిళను లైంగికంగా వాడుకోవడమే కాకుండా, ఆమె మైనర్ కుమార్తెపై కూడా ఇన్స్పెక్టర్ కన్ను వేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మైనర్ బాలిక చదువుతున్న కాలేజీకి వస్తానని బాధితురాలిని ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది నెలలుగా ఈ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా, వారు ఆయనను కాపాడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం వివాదాస్పదం కావడంతో మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఏసీపీ శ్రీకాంత్ ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కమిషనర్ కోరారు. మరోవైపు, బాధితురాలు ఇప్పటికే ముఖ్యమంత్రికి, హోం మంత్రికి , మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!