Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్స్పెక్టర్
- మూడబిద్రి ఇన్స్పెక్టర్పై సంచలన ఆరోపణలు
- బ్లాక్మెయిల్, లైంగిక వేధింపుల ఆరోపణలు
- మైనర్ బాలికపై కన్నేసినట్లు ఆరోపణలు
- విచారణకు ఆదేశాలు, పోలీస్ శాఖ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Se*xual Harassment : శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, తన వద్దకు న్యాయం కోసం వచ్చిన మహిళలనే లైంగికంగా వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. మంగళూరు కమిషనరేట్ పరిధిలోని మూడబిద్రి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సందేష్ పి.జి.పై ఒక మహిళ చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీస్ శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
వివరాల ప్రకారం.. ఒక కుటుంబ కలహాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఇన్స్పెక్టర్ సందేష్ టార్గెట్ చేశాడు. ఆమె భర్తను కేసులో ఇరికించి, అతన్ని విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షల డబ్బు ఇవ్వాలని లేదా తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పోస్టింగ్ కోసం హోం మంత్రికి రూ. 50 లక్షలు ఇచ్చి వచ్చానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన గర్వంగా చెప్పుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు.
ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, సదరు మహిళను లైంగికంగా వాడుకోవడమే కాకుండా, ఆమె మైనర్ కుమార్తెపై కూడా ఇన్స్పెక్టర్ కన్ను వేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మైనర్ బాలిక చదువుతున్న కాలేజీకి వస్తానని బాధితురాలిని ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది నెలలుగా ఈ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా, వారు ఆయనను కాపాడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం వివాదాస్పదం కావడంతో మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఏసీపీ శ్రీకాంత్ ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కమిషనర్ కోరారు. మరోవైపు, బాధితురాలు ఇప్పటికే ముఖ్యమంత్రికి, హోం మంత్రికి , మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!