తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు. తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో…
చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చిరకాలం జీవిస్తారని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని.. తమ నాయకుడిని సీఎం జగన్ ఏం పీకలేడని స్పష్టం చేశారు. జగన్ త్వరలోనే జైలుకు పోతాడని.. ఆయన ఉన్న జైలుకు చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారని కామెంట్ చేశారు. 16 నెలలపాటు జైలులో ఉన్న జగన్ లాంటి చరిత్ర తమకు…
గ్రామాల్లో కరెంట్ పీకుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పిలుపునిచ్చిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.. బాదుడే బాదుడు ఆందోళనల్లో భాగంగా త్వరలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నారు చంద్రబాబు, లోకేష్.. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన చంద్రబాబు.. ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమంపై జరిపిన…
ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతి చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి.. ఆయనే జగన్ లావాదేవీలను దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను…
ఈ నెల 11వ తేదీన కొత్త కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం జగన్ తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.. జిల్లాలు, సామాజిక సమీకరణలు, మహిళలు.. ఇలా అన్ని బేరీజు చేసేపనిలో ఉన్నారు.. అందరికీ మంత్రి పదవి కావాలని ఉన్నా.. అందరూ అధినేతపైనే భారం వేస్తున్నారు.. ఆశగా ఎదురుచూస్తున్నారు.. కేబినెట్ కూర్పు గురించి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు… కేబినెట్ కూర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం అన్నారు.. అసంతృప్తి అనే ప్రశ్నే…
మంత్రులంతా రాజీనామా చేశారు.. ఇవాళో రేపో కొత్త మంత్రులను ఫైనల్ చేయనున్నారు.. దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.. అయితే, ఆశావహులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. ఈ విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మంత్రివర్గంలో నాకు స్థానం ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు… కానీ, ఆశావహుల జాబితాలో నేను ఉన్నాను అన్నారు.. మంత్రి…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. పీకే ఇచ్చిన నివేదికలో తన ప్రభుత్వ పతనమైందని సీఎం జగన్కు తెలిసిందని అందుకే సీఎం జగన్ ఫస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. తాను బలంగా ఉన్నాను అనే ప్రయత్నం సీఎం చేస్తున్నారని.. కానీ తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి పీకుడు భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా సీఎం జగన్ ఏం పీకారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి…
విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్కు సబ్సిడీ ఇచ్చినా వాడుకోలేకపోయారని దుయ్యబట్టారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని.. 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పోలవరం గురించి మాట్లాడే నైతిక…
ఏపీలో అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలను ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి చెందిన డబ్బులను జూన్ నెలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పథకం లబ్ధిదారులు తమ ఆధార్ను గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నెంబర్కు లింక్ చేసిన బ్యాంక్ నెంబర్ను మాత్రమే నమోదు చేయాలని కీలక సూచన…
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తిప్పికొట్టారు. ఏపీకి జగన్ లాంటి సీఎం ఉండటమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని ఆయన రివర్స్ పంచ్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు చెప్పిన్నట్లు జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిదన్నారు. ప్రధాన మంత్రిని కలిసిన సీఎం జగన్ ఏం అడిగారని ప్రశ్నిస్తే.. తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీలు దూషిస్తున్నారని, తిట్టడమే వారి పనిగా పెట్టుకున్నారని…