Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
- తలుపు తట్టిన అదృష్టం..
- రూ.30 వేలు పలికిన రెండు ఎకరాలు నేడు రూ.25 కోట్లు..
- ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా నెలకు రూ.14.50 లక్షల ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయని చాలామంది నమ్ముతారు. పెద్దలు కూడా తమ పిల్లలకు ఎప్పుడూ ఒక చిన్న స్థలాన్నయినా కొని ఉంచమని.. అది ఎప్పటికైనా మీకు ఆదుకుంటుందని పదే పదే సూచిస్తుంటారు. ఈ మాటలు ఎంత నిజమో నిరూపించే ఒక ఆసక్తికరమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్ కొమావర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 36 ఏళ్ల క్రితం అంటే 1990వ సంవత్సరంలో ఆయన మేనమామ తన సొంత ఊరిలో నాలుగు ఎకరాల భూమిని రూ. 60 వేలకే కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ భూమి విలువ అంతంత మాత్రమే. అయితే, కాలక్రమంలో ఆ ఊరు కొత్త జిల్లా కేంద్రంగా మారడం, చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
Also Read:Google Map: గూగుల్ మ్యాప్స్లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్తో మాట్లాడవచ్చు..
ఈ మార్పుల వల్ల ఆ భూమికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని గమనించిన ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘డీ-మార్ట్’, ఆయన వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలను రూ. 25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ మొత్తంతో ఆ వ్యక్తి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ రూ. 25 కోట్లను ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టారు. దీని ద్వారా ప్రస్తుతం ఆయనకు నెలకు దాదాపు రూ. 14.50 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. విశేషం ఏమిటంటే, ఇంకా రెండు ఎకరాల స్థలం ఆయన వద్దనే మిగిలి ఉంది.
ఈ కథనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భూమిని దశాబ్దాల పాటు కాపాడుకోవడం సామాన్యమైన విషయం కాదని, ఆయన ఓపికకు ఫలితం దక్కిందని నెటిజన్లు ప్రశంసించారు. అయితే.. ఇంత భారీ మొత్తానికి వచ్చే పన్నులు, ఇతర ఖర్చుల గురించి కూడా కొందరు నెటిజన్లు ఆసక్తికరంగా ప్రశ్నించారు. మొత్తానికి.. సరైన సమయంలో చేసిన పెట్టుబడి, దానికి కాలం కలిసి రావడం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!