Somireddy: కేటీఆర్ ఎపిసోడ్.. సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్కు కౌంటర్ ఇస్తే.. కొందరు టీడీపీ నేతలు స్వాగతించారు.. మరికొందరు టీఆర్ఎస్-వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఎపిసోడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నిన్నటి టీడీపీ నేతల కామెంట్లకు భిన్నంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు సోమిరెడ్డి.. తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతు బంధు పథకం కింద తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు.. ఏపీలో మాత్రం ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా కింద ఇచ్చేది ఒక్కో కుటుంబానికి రూ.7500 మాత్రమే అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.. ఏపీలో మాత్రం 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారని దుయ్యబట్టారు. ఈ ఘనకార్యాలు చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని పొగాడాలా..? అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి.
Read Also: Talari Venkat Rao: నాపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదు..!
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
రైతులు పండించిన పంటను గింజ గింజా కొనుగోలు చేసి మూడో రోజే తెలంగాణ ప్రభుత్వం రైతులకు నగదు జమ చేస్తోందని ప్రశ్నించారు సోమిరెడ్డి.. ఏపీలో ప్రభుత్వం రైతుల వద్ద 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కొన్న కొద్ది ధాన్యానికి కూడా డబ్బులివ్వడానికి ఆరేడు నెలలు పడుతోందన్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ పోరాటం చేసిందని గుర్తుచేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో చివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ప్రశంసలు కురిపించారు. ఇక, పెట్టుబడులన్నీ ఏకపక్షంగా తెలంగాణకు వెళ్లిపోతున్నాయని.. ఏపీలో పెట్టుబడి పెట్టేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి అర్థం తెలియని ఏపీ మంత్రులు.. ఏపీలో అభివృద్ధి విషయంలో అద్భుతాలు జరిగాయని జోకులేస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఏం సాధించారో అర్థం కావడం లేదు.. రైతు భరోసా కేంద్రాలు.. రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!