Somireddy: కేటీఆర్ ఎపిసోడ్.. సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్కు కౌంటర్ ఇస్తే.. కొందరు టీడీపీ నేతలు స్వాగతించారు.. మరికొందరు టీఆర్ఎస్-వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఎపిసోడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నిన్నటి టీడీపీ నేతల కామెంట్లకు భిన్నంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు సోమిరెడ్డి.. తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతు బంధు పథకం కింద తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు.. ఏపీలో మాత్రం ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా కింద ఇచ్చేది ఒక్కో కుటుంబానికి రూ.7500 మాత్రమే అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.. ఏపీలో మాత్రం 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారని దుయ్యబట్టారు. ఈ ఘనకార్యాలు చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని పొగాడాలా..? అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి.
Read Also: Talari Venkat Rao: నాపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదు..!
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
రైతులు పండించిన పంటను గింజ గింజా కొనుగోలు చేసి మూడో రోజే తెలంగాణ ప్రభుత్వం రైతులకు నగదు జమ చేస్తోందని ప్రశ్నించారు సోమిరెడ్డి.. ఏపీలో ప్రభుత్వం రైతుల వద్ద 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కొన్న కొద్ది ధాన్యానికి కూడా డబ్బులివ్వడానికి ఆరేడు నెలలు పడుతోందన్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ పోరాటం చేసిందని గుర్తుచేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో చివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ప్రశంసలు కురిపించారు. ఇక, పెట్టుబడులన్నీ ఏకపక్షంగా తెలంగాణకు వెళ్లిపోతున్నాయని.. ఏపీలో పెట్టుబడి పెట్టేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి అర్థం తెలియని ఏపీ మంత్రులు.. ఏపీలో అభివృద్ధి విషయంలో అద్భుతాలు జరిగాయని జోకులేస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఏం సాధించారో అర్థం కావడం లేదు.. రైతు భరోసా కేంద్రాలు.. రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!