Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tdp Senior Leaders Fires On Ycp Government In Mayday Celebrations

Bonda Uma: ఏపీలో రామరాజ్యం రావాలంటే.. చంద్రబాబును గెలిపించాలి

Published Date :May 1, 2022 , 9:21 pm
By Ramesh Nalam
Bonda Uma: ఏపీలో రామరాజ్యం రావాలంటే.. చంద్రబాబును గెలిపించాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేడే సందర్భంగా విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమ, గద్దె రామ్మోహనం, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ.. మూడేళ్ల జగన్ పాలనలో ఒక కార్మికుడు చనిపోయినా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా జగన్ సర్కార్ తినేసిందని విమర్శించారు. ఏపీలో మళ్లీ రామరాజ్యం రావాలంటే చంద్రబాబును గెలిపించాలని కోరారు.

మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఈ సభే నాంది కావాలన్నారు. వైసీపీ పాలనలో ఇసుకతో అవినీతి మొదలు పెట్టారని.. వైసీపీ నేతల అవినీతితో తాడేపల్లిలోని జగన్ నివాసానికి వేల కోట్లు తరలిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికుల పొట్టగొట్టిన చరిత్ర జగన్‌దే అని విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో ఆర్టీసీ కార్మికులను మోసం చేశారన్నారు. ఈ ముఖ్యమంత్రి బొగ్గు తీసుకురాడు, కరెంట్ ఇవ్వడని ఎద్దేవా చేశారు.

Also Read

  • Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్‌.. పగటి కలలు మానుకో..!
  • Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
  • Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
  • CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..

అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో రోజుకో మానభంగం జరుగుతోందని ఫైర్ అయ్యారు. హోంమంత్రిగా తానేటి వనిత అనర్హురాలు అని.. ఎప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేను కొట్టడం ఎక్కడైనా చూశారా అని.. ఈ ప్రభుత్వ హయాంలోనే అది చూస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవటానికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కావటానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చిన దద్దమ్మ సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రికి కార్మికులను గౌరవించే సంస్కారం లేదన్నారు. కార్మికుల సంపదను కూడా ఈ ముఖ్యమంత్రి దోచుకున్నారన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో కార్మికుడికి రూ. 5 లక్షలను చంద్రన్న బీమా కింద ఇచ్చామని… కార్మికులు చనిపోతే జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారన్నారు. ఆర్టీసీ కార్మికుడిపై భుజంపై చేయ్యేసి.. చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్పిన జగన్.. ఇప్పుడు వారిని నిలువునా మోసం చేశారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. కార్మికులకు.. ఉద్యోగులకు ఈ సీఎం ఏం ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.18వేల వేతనం ఇచ్చారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి జీతం కూడా పెంచలేదన్నారు. ప్రతినెలా 15వ తేదీ వచ్చినా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం పడటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 9.20 లక్షల ఆటోలు ఉంటే కేవలం 1.20 లక్షల మందికి మాత్రమే రూ. 10 వేలు ఇస్తూ మిగతావారిని సీఎం జగన్ మోసం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • atchennaidu
  • BONDA UMA
  • Devineni Uma
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన

  • RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..

  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

  • Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions