Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!
- నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను
- దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది..
- అందుకే నేను కుప్పకూలిపోకుండా లేచి ముందుకు సాగాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal: వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన కుమారుడి మరణం తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకుంటూ ‘ఇండియా టుడే కాన్క్లేవ్ 2026’లో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తన ఏకైక కుమారుడిని కోల్పోయినా, దేశాభివృద్ధి కోసం తన పయనాన్ని ఆపనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దగ్గర అపారమైన అవకాశాలు ఉన్నాయని, స్వయం సమృద్ధి దిశగా మనం అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
READ ALSO: Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ (49) ఇటీవల న్యూయార్క్లో స్కీయింగ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వేదాంత గ్రూప్లో అగ్నివేష్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషాదంపై స్పందిస్తూ అగర్వాల్ కన్నీటి పర్యంతమయ్యారు. “నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను. ఈ ఘటన తర్వాత నేను కుప్పకూలిపోవాలి లేదా లేచి నిలబడి ముందుకు సాగాలి. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నా గుండెల్లో భారతదేశం ఉంది. దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ అనుభవం నన్ను నిడరంగా మార్చింది, ఇప్పుడు నాకు దేనికీ భయం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ విద్య కంటే స్వదేశీ విద్యే మిన్న!
భారతదేశం నుంచి ఏటా సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడంపై అనిల్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే అవకాశాలు ఉన్నాయని, యువతకు ఇక్కడే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. “మన దేశంలోని యువత, మహిళలు, రిటైర్డ్ సైనిక అధికారులకు సరైన అవకాశాలు ఇస్తే భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్కు అవసరమైన చమురు డిమాండ్లో 90% దిగుమతుల ద్వారానే తీరుతోందని, దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నా విధానపరమైన అనుమతుల జాప్యం వల్ల వెలికితీత సాధ్యం కావడం లేదని అన్నారు. మధ్యప్రాచ్య దేశాలు భారత్ ఎప్పుడూ తమపై ఆధారపడాలని కోరుకుంటున్నాయని, భారత్ స్వయం సమృద్ధి సాధించడాన్ని అవి ఇష్టపడటం లేదని అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశీయ ఇంధన వనరులను విస్తరించడం అత్యవసరమని, తక్షణమే విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
READ ALSO: Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!