Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!
- నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను
- దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది..
- అందుకే నేను కుప్పకూలిపోకుండా లేచి ముందుకు సాగాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal: వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన కుమారుడి మరణం తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకుంటూ ‘ఇండియా టుడే కాన్క్లేవ్ 2026’లో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తన ఏకైక కుమారుడిని కోల్పోయినా, దేశాభివృద్ధి కోసం తన పయనాన్ని ఆపనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దగ్గర అపారమైన అవకాశాలు ఉన్నాయని, స్వయం సమృద్ధి దిశగా మనం అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
READ ALSO: Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ (49) ఇటీవల న్యూయార్క్లో స్కీయింగ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వేదాంత గ్రూప్లో అగ్నివేష్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషాదంపై స్పందిస్తూ అగర్వాల్ కన్నీటి పర్యంతమయ్యారు. “నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను. ఈ ఘటన తర్వాత నేను కుప్పకూలిపోవాలి లేదా లేచి నిలబడి ముందుకు సాగాలి. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నా గుండెల్లో భారతదేశం ఉంది. దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ అనుభవం నన్ను నిడరంగా మార్చింది, ఇప్పుడు నాకు దేనికీ భయం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ విద్య కంటే స్వదేశీ విద్యే మిన్న!
భారతదేశం నుంచి ఏటా సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడంపై అనిల్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే అవకాశాలు ఉన్నాయని, యువతకు ఇక్కడే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. “మన దేశంలోని యువత, మహిళలు, రిటైర్డ్ సైనిక అధికారులకు సరైన అవకాశాలు ఇస్తే భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్కు అవసరమైన చమురు డిమాండ్లో 90% దిగుమతుల ద్వారానే తీరుతోందని, దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నా విధానపరమైన అనుమతుల జాప్యం వల్ల వెలికితీత సాధ్యం కావడం లేదని అన్నారు. మధ్యప్రాచ్య దేశాలు భారత్ ఎప్పుడూ తమపై ఆధారపడాలని కోరుకుంటున్నాయని, భారత్ స్వయం సమృద్ధి సాధించడాన్ని అవి ఇష్టపడటం లేదని అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశీయ ఇంధన వనరులను విస్తరించడం అత్యవసరమని, తక్షణమే విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
READ ALSO: Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!