Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!
- నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను
- దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది..
- అందుకే నేను కుప్పకూలిపోకుండా లేచి ముందుకు సాగాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal: వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన కుమారుడి మరణం తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకుంటూ ‘ఇండియా టుడే కాన్క్లేవ్ 2026’లో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తన ఏకైక కుమారుడిని కోల్పోయినా, దేశాభివృద్ధి కోసం తన పయనాన్ని ఆపనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దగ్గర అపారమైన అవకాశాలు ఉన్నాయని, స్వయం సమృద్ధి దిశగా మనం అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
READ ALSO: Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
Also Read
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ (49) ఇటీవల న్యూయార్క్లో స్కీయింగ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వేదాంత గ్రూప్లో అగ్నివేష్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషాదంపై స్పందిస్తూ అగర్వాల్ కన్నీటి పర్యంతమయ్యారు. “నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను. ఈ ఘటన తర్వాత నేను కుప్పకూలిపోవాలి లేదా లేచి నిలబడి ముందుకు సాగాలి. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నా గుండెల్లో భారతదేశం ఉంది. దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ అనుభవం నన్ను నిడరంగా మార్చింది, ఇప్పుడు నాకు దేనికీ భయం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ విద్య కంటే స్వదేశీ విద్యే మిన్న!
భారతదేశం నుంచి ఏటా సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడంపై అనిల్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే అవకాశాలు ఉన్నాయని, యువతకు ఇక్కడే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. “మన దేశంలోని యువత, మహిళలు, రిటైర్డ్ సైనిక అధికారులకు సరైన అవకాశాలు ఇస్తే భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్కు అవసరమైన చమురు డిమాండ్లో 90% దిగుమతుల ద్వారానే తీరుతోందని, దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నా విధానపరమైన అనుమతుల జాప్యం వల్ల వెలికితీత సాధ్యం కావడం లేదని అన్నారు. మధ్యప్రాచ్య దేశాలు భారత్ ఎప్పుడూ తమపై ఆధారపడాలని కోరుకుంటున్నాయని, భారత్ స్వయం సమృద్ధి సాధించడాన్ని అవి ఇష్టపడటం లేదని అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశీయ ఇంధన వనరులను విస్తరించడం అత్యవసరమని, తక్షణమే విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
READ ALSO: Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!