తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగసభపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిది.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్న ఆయన.. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లాడు.. కానీ, ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. కడప అమీన్పీర్ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్ కార్యక్రమాలకు హాజరు, కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు.. ఇలా మూడు రోజులు బిజీ బిజీగా గడపనున్నారు…
సెక్స్ వర్కర్లలో ఏపీ టాప్.. సెక్స్ వర్కర్ల విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాకాంలు ఆందోళన కలిగిస్తున్నాయి.. సెక్స్ వర్కర్లను రెండు కేటగిరీలుగా విభజించి గణాంకాలు విడుదల చేసింది కేంద్రం.. అయితే, ఓ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అనూహ్యకంగా టాప్ స్పాట్కు దూసుకొచ్చింది.. ఇంకో జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఇక, ఆ జాబితాల విషానికి వస్తే.. సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను, స్థానిక సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అంటూ.. రెండు…
టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలతో పెనవేసుకున్న నాయకుడు… గంటా శ్రీనివాస్రావు. గడచిన ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత గంటా సీన్ మారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీతో టచ్ మీ నాట్గా ఉంటున్నారు. ఈ వైఖరి టీడీపీలోని గంటా ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. అడపా దడపా టీడీపీ వేదికలపై మాజీ మంత్రి కనిపిస్తున్నా.. పార్టీ ఫ్లేవరుకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. గంటా వైసీపీలో చేరిపోతారనే ప్రచారం…
భారతదేశంలోని సెక్స్ వర్కర్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం, అత్యధిక సంఖ్యలో స్థానిక సెక్స్ వర్కర్లు ఉన్న మొదటి 3 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. భారత్లో హెచ్ఐవీ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం దేశంలోని సెక్స్ వర్కర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున కొన్ని అధ్యయనాలు…
దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుంది అని మండిపడ్డారు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ.. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్న ఆయన.. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ఈనెల 29న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. విజయవాడలోని రాజ్ భవన్ దగ్గర పెద్దఎత్తున నిరసన చేపడతామన్న ఆయన.. సీబీఐ, ఈడీ వ్యవస్థలు బ్లాక్ మెయిల్స్ గా మారాయని విమర్శించారు. ఎన్ని తప్పులు చేసినా బీజేపీలో ఉంటే ఎటువంటి ఈడీ దాడులు ఉండవని మండిపడ్డారు..…
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. జేసీ ఫ్యామిలీ.. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా అక్రమంగా విక్రయించిందన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మాజీమంత్రి జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్రెడ్డికి చెందిన జఠధార ఇండస్ట్రీస్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కీలకమ్తెన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. Read…