OTR about Ganta Srinivasa Rao: ‘అమ్మో గంటా’..! దూరం జరుగుతున్న నేతలు.. ఆ పేరు చెబితే నేతల ఉలికిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలతో పెనవేసుకున్న నాయకుడు… గంటా శ్రీనివాస్రావు. గడచిన ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత గంటా సీన్ మారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీతో టచ్ మీ నాట్గా ఉంటున్నారు. ఈ వైఖరి టీడీపీలోని గంటా ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. అడపా దడపా టీడీపీ వేదికలపై మాజీ మంత్రి కనిపిస్తున్నా.. పార్టీ ఫ్లేవరుకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. గంటా వైసీపీలో చేరిపోతారనే ప్రచారం ఈ మధ్య గట్టిగానే జరిగింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయో లేదో కానీ.. ఎక్కడున్న గంటా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఆయనపై అనుమానపు నీడలు తొలగలేదు. ఈ మధ్య కాలంలో గంటా శ్రీనివాసరావు కాపు నినాదాన్ని భుజాన వేసుకున్నారు. దానిపై టీడీపీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ నెల 26న కాపునాడు సమావేశం జరపాలని కాపు సామాజికవర్గానికి చెందిన పెద్దలు నిర్ణయించారు. ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కాపునాడు కార్యక్రమం నిర్వహించాలని భావించినా.. అది విజయవాడకు మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలను ఒక్కొక్కరిని గంటా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశం ఆ వ్యూహంలో భాగమేనట. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆ సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి పదిన్నరకు మొదలైన సమావేశం.. అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది. ఆ భేటీలో గంటా, బొండాతోపాటు కన్నా కూడా ఉన్నారు. ఆ సమావేశంపైనే టీడీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also Read
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు సామాజికవర్గ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా.. అడుగులు వేయాలన్న ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారట. కాపులను బూచిగా చూపించి.. బీసీలను వైసీపీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన టీడీపీలో ఉంది. టీడీపీలో కాపు నేతగా ఉన్న బొండా ఉమ.. పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న గంటాతో భేటీ కావడం తప్పుడు సంకేతాలిస్తుందనే చర్చ జరుగుతోందట. దీనిపై బహిరంగంగా ఎవ్వరూ చెప్పకపోయినా.. ఆ సమావేశానికి ఉమా వెళ్లడాన్ని తప్పు పడుతూ గుసగుసలాడుతున్నారట.
టీడీపీలోని మరికొందరు కాపు నేతలకు గంటా ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీలున్నప్పుడు భేటీ అవుదాం.. చర్చిద్దామని మాటలు కలుపుతున్నారట. అయితే బొండా ఎపిసోడుతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఏదో సాకు చెప్పి.. గంటా ఛాయల నుంచి తప్పించుకుంటున్నారట. పార్టీ అధినాయకత్వం ఈ తంతును సీరియస్గా తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట. ఇదే సమయంలో టీడీపీ కాపు నేతలకు మరో చిక్కొచ్చి పడింది. కాపు సంక్షేమం కోసం.. ఓ సమావేశం పెట్టుకుందామని ఆహ్వానిస్తే.. దానికి వెళ్లడం లేదనే ఫీలర్లు బయటకు వెళ్తే.. సొంత సామాజికవర్గంలోనూ.. కాపు ఓటర్లకూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందంటున్నారట. ఈ క్రమంలో టీడీపీ కాపు నేతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట.
తాజావార్తలు
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!