Off The Record: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. ఆయన ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు పెట్టినా సంయమనం పాటించడం, పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వార్నింగ్ ఇవ్వడం వరకే పరిమితమైన అధిష్టానం ఇప్పుడు ఉలిక్కిపడి దిద్దుబాటు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొలికపూడి ఇటీవల కొత్తగా దళిత కార్డ్ ప్రయోగించడంతో పార్టీ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారట. ఆయనకు అదే రేంజ్లో కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు…
Off The Record: తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు నియోజకవర్గ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు యనమల కృష్ణుడు. గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలోకి జంప్ అయిపోయారు. మొదట్లో బాగానే ఉన్నా… ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గట్టిగా చెప్పాలంటే… ఇప్పుడు యనమల కృష్ణుడి పరిస్థితి పుట్టింటోళ్ళు తరిమేశారు-కట్టుకున్నోడు వదిలేశాడన్నట్టుగా తయారైందన్నది పొలిటికల్ టాక్. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు వరుసకు సోదరుడైన కృష్ణుడు గతంలో తుని నియోజకవర్గంలో చక్రం తిప్పారు.…
NBW Against Anantha Lakshmi Durga: తూర్పు గోదావరి జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గపై జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి Uma Sunanda ఈ ఆదేశాలు జారీ చేశారు. కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అనంత లక్ష్మీ దుర్గపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అనంత లక్ష్మీ…
Perni Nani : కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. అప్పుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అప్పుల విషయంలో ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదని పేర్ని నాని అన్నారు. గత ఏడాది సుమారు రూ.1.03 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ వాస్తవ…
Off The Record: అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వివాదాలు రేగుతుండగా, మరికొన్ని చోట్ల సమసిపోయాయనుకున్న విభేదాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాకు చెందినఇద్దరు కీలన నేతల మధ్య ఇలాంటిదే జరుగుతోందట. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజు మధ్య పాత పగలు మళ్లీ రేగుతున్నాయట. ఇద్దరూ రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన వారే. పైగా ఇద్దరిదీ…ఒకటే బలమైన…
Off The Record: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు బోండా ఉమా. ఇప్పటికి మూడుసార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచారాయన. 2019లో కేవలం 23 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అలా…. వోవరాల్గా…. నియోజకవర్గం మీద ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే అనుచరగణం కూడా భారీగానే ఉంటుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతోందట. తమలో తాము ఆధిపత్య పోరుకు దిగడం, అది…
Off The Record: ప్రకాశం జిల్లా జనసేనలో ఎన్నికలకు ముందు వరకూ అంతా ఓకే అన్నట్టుగానే ఉన్నా.. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోకి ఎంట్రీ ఇచ్చాక ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో…జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఒక జట్టుగా పనిచేశారు. ఇక ఎన్నికల తర్వాతి పరిణామాలతో… ఒంగోలు వైసీపీ కార్పొరేటర్స్లో కొందరు బాలినేనితో పాటు జనసేనలో చేరగా.. మరికొందరు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీకి…
Off The Record: శత్రువులు ఎక్కడో ఉండరన్న సినిమా డైలాగ్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సరిగ్గా సరిపోతుందన్న టాక్ నడుస్తోంది నెల్లూరు జిల్లాలో. కాకుంటే…ఆ డైలాగ్ లెక్క అయితే ఇంట్లో ఉంటారు, ఇక్కడ మాత్రం సొంత పార్టీలో, అనుచరుల రూపంలో ఉన్నారట. నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న అడ్డగోలు పనులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి తలనొప్పిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ వ్యవహారాలేగాక, తమ ట్రస్ట్ ద్వారా కూడా ఎమ్మెల్యే దంపతులు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారని,…
Off The Record: తూర్పుగోదావరి జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయనేంటి…. ఇలా అయిపోయారేంటి…. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సోము వీర్రాజు ఇలా కామ్గా మారిపోయారేంటి? బ్యాక్గ్రౌండ్ స్టోరీ గట్టిగానే ఉందా అంటూ…. రకరకాల విశ్లేషణలు చేసేస్తూ ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు. ఈ మౌనం వ్యూహాత్మకమా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. ఫైర్ బ్రాండ్ నుంచి ఫ్రెండ్లీ టోన్కు ఎందుకు మారారంటూ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మిత్రపక్షమా? కాదా..? అన్నదాంతో సంబంధం…
Off The Record: 2024 ఎన్నికల్లో జనసేనకు వెన్నెముకగా నిలబడింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ఈ జిల్లా నుంచి గ్లాస్ గుర్తు మీద ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే… ఆ జోష్ ఇప్పుడు కనిపించడం లేదన్నది లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి వాళ్ళు వీళ్లు కాదు, సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. ఎమ్మెల్యేలు తమ పనులు చక్కబెట్టుకునే దిశలో ప్రయాణిస్తుంటే… ఇన్ఛార్జ్లు సొంత లాభాలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.…