AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఎంపీకి నోటీసులు జారీ చేసింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు ఉన్నాయని…
Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఘాటైన పాలిటిక్స్కు కేరాఫ్ జిల్లా గుంటూరు. జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లలో గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు బలమైన ఓటుబ్యాంక్ గా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఈ సామాజికవర్గాలు గెలుపోటములను ప్రబావితం చేసేస్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా వైసీపీకి ఎస్సీ సామాజికవర్గం బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మూడు ఉన్నాయి. ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు…
Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం… ఎప్పుడు పొలిటికల్ హీట్ వుండే నియోజకవర్గం… టీడీపీ అయినా, వైసీపీ అయినా సరే… నిత్యం వార్తల్లో ఉండాల్సిందే. ఎమ్మిగనూరు వైసీపీ లో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్య వార్ నడుస్తుడగా తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరు పక్కపక్క నియోజకవర్గాలు. బాలనాగిరెడ్డికి ఎమ్మిగనూరులోను అంతో ఇంతో పట్టుంది. బాలనాగిరెడ్డి కుమారుడు…
Gorantla Madhav NBW: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు పెద్ద షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలతో గోరంట్ల మాధవ్పై గతంలోనే పోక్సో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడంతో విజయవాడలోని పోక్సో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్…
Off The Record: కరవమంటే కప్పకి విడవమంటే పాముకి అన్నట్టుగా ఉందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ పెద్దలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అదే పార్టీ నాయకులు. ఏరి కోరి అవకాశాలు ఇచ్చిన నాయకులు పార్టీని వదిలిపోతుంటే.. కష్టపడి పని చేసినా గుర్తింపు ఇవ్వలేదని మరో నేత పక్కకి జరిగారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన…
SVSN Varma: గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ) వార్తల్లో నిలిచారు.. మొదట సీటు కోసం పట్టుబట్టిన ఆయన.. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్దిచెప్పడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు.. ఇక, పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.. అయితే, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన…
CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా కొండపై వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం, పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం, భోగాపురం ఎయిర్పోర్టు,…
OTR: భాష్యం ప్రవీణ్….. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి ఫస్ట్ టైమర్ అయినా… అనేక వ్యవహారాల్లో బాగా ఆరితేరిపోయారన్న విమర్శలు, ఇసుక దందాల్లో బాగా చెయ్యి తిరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు ఎక్కువగా ఉంటాయి. అదే… ఎమ్మెల్యే ప్రవీణ్కు వరంగా మారిందని, పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటితో పాటు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో సార్ ఆరిపోయారని చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే…
Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.…
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర్నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ తో పాటు కేసులో నిందితులుగా…