Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వీణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై రైల్వేకోడూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు క్వాష్ చేయాలని శ్రీధర్ పిటిషన్ వేశారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని.. ఎలాంటి ఆధారాలు లేని దురుద్దేశంతో పెట్టిన కేసు నుంచి ఉపశమనం కల్పించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఎన్ఎస్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ఏకపక్ష అరెస్టులను కష్టతరం చేస్తుంది. అరెస్ట్ ఆవశ్యకతను సమర్థిస్తూ పోలీసు అధికారి వ్రాతపూర్వక కారణాలను నమోదు చేస్తే తప్ప అరెస్టు చేయలేరు. ఒక వేళ అరెస్ట్ చేస్తే చట్టబద్ధంగా సవాలు చేస్తుంది.
READ MORE: RCB vs DC Women Final: వడోదరలో 160+ టార్గెట్ ఛేజ్ అంటే అసాధ్యమే.. కప్ ఢిల్లీ క్యాపిటల్స్దే?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇదిలా ఉండగా.. లైంగిక దాడి, మోసం ఆరోపణల నేపథ్యంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను జనసేన త్రిసభ్య కమిటీ మొన్న (మంగళవారం) సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కోడూరుకు వచ్చిన కమిటీ సభ్యులు రమాదేవి, శివశంకర్, వరుణ్.. నేరుగా స్థానిక రాజ్ రెసిడెన్సీలో ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. బాధితురాలు చేసిన ఆరోపణలు, వాట్సప్ చాటింగ్ వ్యవహారం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై అరవ శ్రీధర్ను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన వాదనను కమిటీ ముందు సవివరంగా వినిపించారు. ఎమ్మెల్యేనే కాకుండా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సుమారు 40 మంది ఎంపిక చేసిన నాయకులు, కార్యకర్తలను కూడా కమిటీ పిలిపించి విచారించింది. ఎమ్మెల్యే ప్రవర్తన, తాజా పరిణామాలపై వారి నుంచి సమాచారం సేకరించింది. సాయంత్రం మరోసారి ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడారు. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
READ MORE:Chahal: “భారత్ను ఓడించే సత్తా వారికి మాత్రమే ఉంది”.. టీ20 వరల్డ్ కప్పై చహల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..