Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Single Member Committee On Tirumala Laddu Adulteration Case Cm Chandrababu Says No One Will Be Spared

CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!

Published Date :February 5, 2026 , 2:49 pm
By Sudhakar Ravula
CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తన నివాసంలో కూటమి ప్రభుత్వంలోని నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కూడా చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు, గత పాలకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తప్పులు చేసి మళ్లీ తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గమైన రాజకీయమని అన్నారు.

తిరుమల లడ్డూ వ్యవహారం కేవలం రాజకీయ విషయం కాదని, భక్తుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి మా కుటుంబ దైవం. దేవుడి నామాలు చూసినా భక్తి కలుగుతుంది. ప్రతి శనివారం ఉపవాసంగా ఉండే సంప్రదాయంలోనే పెరిగాం అని తెలిపారు. 2003లో అలిపిరిలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తిరుమల కొండపైకి వెళ్తున్న సమయంలోనే ఆ దాడి జరిగిందన్నారు. ఆ దాడి నుంచి బతికానంటే అది దేవుడి కృపే. నాకు పునర్జన్మ లభించింది. దేవుడిపై నమ్మకం లేకుండా ఉండలేను అని భావోద్వేగంగా చెప్పారు.

గడిచిన ఐదేళ్లలో కొన్ని శక్తుల ప్రవర్తన పరాకాష్టకు చేరిందని సీఎం విమర్శించారు. అంతర్వేదిలో రథం తగలబెట్టిన ఘటనపై చర్యలు తీసుకోకుండా, తిరిగి తమ పార్టీపై విమర్శలు చేశారని ఆరోపించారు చంద్రబాబు.. 2022లో వచ్చిన నివేదికలోనే లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు స్పష్టంగా వెల్లడైందని చంద్రబాబు తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక, ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించి, టీటీడీ ఈవోను బాధ్యతల్లోకి తీసుకొచ్చి లోపాలను సరిదిద్దాలని ఆదేశించానని చెప్పారు. సిట్ నివేదికలో పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్లు తేలిందని సీఎం పేర్కొన్నారు. ఇది భక్తుల విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసే అంశమని అన్నారు. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదు. బ్రిటిష్ పాలకులు కూడా దేవుడి పవిత్రతను కాపాడారు అని వ్యాఖ్యానించారు.

సీబీఐ క్లీన్ చీట్ ఇవ్వలేదు
సీబీఐ నివేదిక ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దేవుడి పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని చెప్పారు. ఈ వ్యవహారంపై స్పష్టత కోసం మూడు పార్టీల సమావేశం నిర్వహించామని, తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది దేవుడి కార్యక్రమం కింద మాకు అప్పగించిన బాధ్యత అని అన్నారు. కల్తీ కలిసిన ప్రసాదాన్ని భక్తులు తీసుకున్నారన్న విషయం బాధాకరమని చెప్పారు. లడ్డూ తిరుమలకే పరిమితం. కానీ లడ్డూ తినాలంటే భక్తులు భయపడే పరిస్థితి వచ్చింది. తిరుమలకు రావడానికే సందేహపడే వాతావరణం ఏర్పడింది అని ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్‌ వివేకా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, గతంలో తన చేతిలో కత్తి పెట్టినట్టే ఇప్పుడు కూడా దేవుడి విషయంలో తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. మన సమస్యలన్నీ ఆయనకే అప్పగిస్తాం. అటువంటి దేవుడిపై జరిగిన దాడిని సహించం అని స్పష్టం చేశారు. తిరుపతి వచ్చినప్పుడు దర్శనానికి ముందు డిక్లరేషన్‌పై సంతకం చేయాలని చెప్పామని, అబ్దుల్ కలాం కూడా సంతకం చేశారని సీఎం గుర్తు చేశారు. అన్యమతస్తులు దర్శనానికి వస్తే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేవుడి పవిత్రతను కాపాడలేని అసమర్థులం కాదని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political news
  • CBI report laddu case
  • Chandrababu Naidu comments
  • cm chandrababu
  • single member committee Tirumala

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions