Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్
Bhumana Karunakar Reddy: వైసీపీ, మాజీ సీఎం జగన్ను నాశనం చేయాలని సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దానికోసం ఇప్పటి దాక వ్యవస్థలను వాడుకున్నారు.. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు అనేలా చంద్రబాబు, పవన్, బీజేపీ నేత మాధవ్ ప్రెస్ మీట్ ఉందన్నారు. తప్పులు చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేస్తే.. ఉలిక్కిపడి చంద్రబాబు ఈరోజు ముగ్గురు నేతలను తీసుకుని వచ్చారన్నారు. అవసరం అయితే గొడ్డు మాసం తింటాను అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారన్నారు. స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా?.. ఇంకా ఎవరు లేరా? అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలోనే వేలాది ఆలయాలు కూల్చివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మద్యం అమ్మారని.. బిర్యానీ తిన్నారన్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలా ఎన్నో దారుణాలు జరిగాయని విమర్శించారు..
READ MORE: Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
“మంచి పనులే చేస్తే అలిపిరి దగ్గరే చంద్రబాబుపై బాంబు దాడి ఎందుకు జరిగింది? NDDB రిపొర్టు లో జబ్బు పడినా అవులు, అనారోగ్యంతో ఉన్న ఆవుల వల్ల కూడా అలా జరుగుతుందని రిపొర్టులో ఉంది.సిట్ ఇచ్చిన చార్జ్ షీట్ గురించి ఇప్పటి వరకు మాట్లాడటం లేదు.. రిటన్ చేసినా నాలుగు ట్యాంకులను మళ్ళీ తిరుమల పంపించింది కూటమి ప్రభుత్వం. కొరియా నుంచి వచ్చిన కెమికల్స్ తెచ్చారంటూ కొత్త రాగం పాడుతున్నారు. సిట్ ఇచ్చిన రిపొర్టులో ఎక్కడ అనిమల్ ఫ్యాక్ట్ లేదని చెప్పారు. తన భాగస్వామ్య పార్టీలతో జగన్ పై కుట్రకు చేస్తున్నారు.. దీని వెనుక కుట్ర ఉంది అంటూ అబద్దాలు చెబుతున్నారు . ఏకసభ్య కమిషన్ వేసి మమ్మల్ని నేరస్థులుగా చేయాలనే ప్రయత్నం తప్ప ఎమీలేదు. అయోధ్యకు కూడా కల్తీ నెయ్యితో తయారు చేసినా లడ్డూలు పంపారని పవన్ కల్యాణ్ అబద్దాలు చెబుతున్నారు. చెప్పిన అబద్దాన్నే పదేపదే పవన్ కల్యాణ్ చెబుతున్నారు.. నిబంధనలు సడలించడం ద్వారా ఒక కొత్త కంపెనీ అయినా వచ్చిందా? దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రీమియర్ డైరీ ద్వారా చంద్రబాబు హాయంలో రూ. 271కి నెయ్యి సరపరా చేశారు. ఇది పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి.. గత ఐదేళ్ళ భక్తుల రద్ది తగ్గిందని విచారణ చేయించి నిరూపించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని భూమన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!