Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: వైసీపీ, మాజీ సీఎం జగన్ను నాశనం చేయాలని సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దానికోసం ఇప్పటి దాక వ్యవస్థలను వాడుకున్నారు.. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు అనేలా చంద్రబాబు, పవన్, బీజేపీ నేత మాధవ్ ప్రెస్ మీట్ ఉందన్నారు. తప్పులు చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేస్తే.. ఉలిక్కిపడి చంద్రబాబు ఈరోజు ముగ్గురు నేతలను తీసుకుని వచ్చారన్నారు. అవసరం అయితే గొడ్డు మాసం తింటాను అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారన్నారు. స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా?.. ఇంకా ఎవరు లేరా? అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలోనే వేలాది ఆలయాలు కూల్చివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మద్యం అమ్మారని.. బిర్యానీ తిన్నారన్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలా ఎన్నో దారుణాలు జరిగాయని విమర్శించారు..
READ MORE: Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
“మంచి పనులే చేస్తే అలిపిరి దగ్గరే చంద్రబాబుపై బాంబు దాడి ఎందుకు జరిగింది? NDDB రిపొర్టు లో జబ్బు పడినా అవులు, అనారోగ్యంతో ఉన్న ఆవుల వల్ల కూడా అలా జరుగుతుందని రిపొర్టులో ఉంది.సిట్ ఇచ్చిన చార్జ్ షీట్ గురించి ఇప్పటి వరకు మాట్లాడటం లేదు.. రిటన్ చేసినా నాలుగు ట్యాంకులను మళ్ళీ తిరుమల పంపించింది కూటమి ప్రభుత్వం. కొరియా నుంచి వచ్చిన కెమికల్స్ తెచ్చారంటూ కొత్త రాగం పాడుతున్నారు. సిట్ ఇచ్చిన రిపొర్టులో ఎక్కడ అనిమల్ ఫ్యాక్ట్ లేదని చెప్పారు. తన భాగస్వామ్య పార్టీలతో జగన్ పై కుట్రకు చేస్తున్నారు.. దీని వెనుక కుట్ర ఉంది అంటూ అబద్దాలు చెబుతున్నారు . ఏకసభ్య కమిషన్ వేసి మమ్మల్ని నేరస్థులుగా చేయాలనే ప్రయత్నం తప్ప ఎమీలేదు. అయోధ్యకు కూడా కల్తీ నెయ్యితో తయారు చేసినా లడ్డూలు పంపారని పవన్ కల్యాణ్ అబద్దాలు చెబుతున్నారు. చెప్పిన అబద్దాన్నే పదేపదే పవన్ కల్యాణ్ చెబుతున్నారు.. నిబంధనలు సడలించడం ద్వారా ఒక కొత్త కంపెనీ అయినా వచ్చిందా? దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రీమియర్ డైరీ ద్వారా చంద్రబాబు హాయంలో రూ. 271కి నెయ్యి సరపరా చేశారు. ఇది పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి.. గత ఐదేళ్ళ భక్తుల రద్ది తగ్గిందని విచారణ చేయించి నిరూపించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని భూమన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..