Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: వైసీపీ, మాజీ సీఎం జగన్ను నాశనం చేయాలని సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దానికోసం ఇప్పటి దాక వ్యవస్థలను వాడుకున్నారు.. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు అనేలా చంద్రబాబు, పవన్, బీజేపీ నేత మాధవ్ ప్రెస్ మీట్ ఉందన్నారు. తప్పులు చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేస్తే.. ఉలిక్కిపడి చంద్రబాబు ఈరోజు ముగ్గురు నేతలను తీసుకుని వచ్చారన్నారు. అవసరం అయితే గొడ్డు మాసం తింటాను అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారన్నారు. స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా?.. ఇంకా ఎవరు లేరా? అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలోనే వేలాది ఆలయాలు కూల్చివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మద్యం అమ్మారని.. బిర్యానీ తిన్నారన్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలా ఎన్నో దారుణాలు జరిగాయని విమర్శించారు..
READ MORE: Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
“మంచి పనులే చేస్తే అలిపిరి దగ్గరే చంద్రబాబుపై బాంబు దాడి ఎందుకు జరిగింది? NDDB రిపొర్టు లో జబ్బు పడినా అవులు, అనారోగ్యంతో ఉన్న ఆవుల వల్ల కూడా అలా జరుగుతుందని రిపొర్టులో ఉంది.సిట్ ఇచ్చిన చార్జ్ షీట్ గురించి ఇప్పటి వరకు మాట్లాడటం లేదు.. రిటన్ చేసినా నాలుగు ట్యాంకులను మళ్ళీ తిరుమల పంపించింది కూటమి ప్రభుత్వం. కొరియా నుంచి వచ్చిన కెమికల్స్ తెచ్చారంటూ కొత్త రాగం పాడుతున్నారు. సిట్ ఇచ్చిన రిపొర్టులో ఎక్కడ అనిమల్ ఫ్యాక్ట్ లేదని చెప్పారు. తన భాగస్వామ్య పార్టీలతో జగన్ పై కుట్రకు చేస్తున్నారు.. దీని వెనుక కుట్ర ఉంది అంటూ అబద్దాలు చెబుతున్నారు . ఏకసభ్య కమిషన్ వేసి మమ్మల్ని నేరస్థులుగా చేయాలనే ప్రయత్నం తప్ప ఎమీలేదు. అయోధ్యకు కూడా కల్తీ నెయ్యితో తయారు చేసినా లడ్డూలు పంపారని పవన్ కల్యాణ్ అబద్దాలు చెబుతున్నారు. చెప్పిన అబద్దాన్నే పదేపదే పవన్ కల్యాణ్ చెబుతున్నారు.. నిబంధనలు సడలించడం ద్వారా ఒక కొత్త కంపెనీ అయినా వచ్చిందా? దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రీమియర్ డైరీ ద్వారా చంద్రబాబు హాయంలో రూ. 271కి నెయ్యి సరపరా చేశారు. ఇది పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి.. గత ఐదేళ్ళ భక్తుల రద్ది తగ్గిందని విచారణ చేయించి నిరూపించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని భూమన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!