అగ్ర రాజ్యం అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్కు మంచిరోజులు వచ్చాయి. నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత బుధవారం ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ 90,000 డాలర్లకు చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మన మార్కె్ట్కు నవంబర్ నెల అంతగా కలిసి రానున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఫలితాలకు ముందు అనిశ్చితి ఏర్పడడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫలితాలు వచ్చాక అధ్యక్షుడెవరో ఒక క్లారిటీ వచ్చేసింది.
అమెరికాలో అబార్షన్ మందులకు భారీగా డిమాండ్ పెరిగింది. చాలామంది గర్భనిరోధకాలు, అబార్షన్ మాత్రలను ఆర్డర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
గాజా, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఆదివారం డెలావేర్లోని ఇసుక బీచ్లో గడిపేందుకు వెళ్లారు. అయితే బైడెన్ ఇసుకలో నడిచేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు బైడెన్ తుళ్లిపడబోయారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు.
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్పై యుద్ధం ముగించాలంటూ పుతిన్కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. కానీ అసలైన ఫలితాలు వచ్చేటప్పటికీ సర్వేలన్నీ తలకిందులయ్యాయి.
ఫ్లైట్లో ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి క్లిప్లో ఉన్న విమానం భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విమానం అత్యవసర తలుపును ఒక వ్యక్తి అకస్మాత్తుగా తెరవడానికి ప్రయత్నిస్తాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలంటూ తమిళనాడు వాసులు పూజలు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ బ్యానర్లు కట్టారు. తీరా.. ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ నిరాశలోకి వెళ్లిపోయారు.