US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి.. కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి
- అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి
- కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి
- 4 నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సాయితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. తాజాగా తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. చికాగో పెట్రోల్ పంప్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపును కాల్చి చంపారు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ(22) నాలుగు నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అయితే చికాకూ పెట్రోల్ బంక్లో జరిపిన కాల్పుల్లో సాయి తేజ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.
బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ పరామర్శించారు. మృతదేహం భారత్ తీసుకొచ్చేందుకు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. సాయితేజ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. పార్ట్టైమ్గా చికాగో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. కాల్పులు జరిపినప్పుడు మాత్రం డ్యూటీలో లేడు. తన స్నేహితుడికి సాయం చేస్తున్నాడు. ఆ సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సహాయం చేయడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో కూడా మాట్లాడినట్లు మధుసూదన్ చెప్పారు.
ఇది కూడా చదవండి:OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?
తాజావార్తలు
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?