Putin-Zelensky: 4 ఏళ్ల యుద్ధం తర్వాత కీలక పరిణామం.. జెలెన్స్కీని మాస్కోకు ఆహ్వానించిన రష్యా
- 4 ఏళ్ల యుద్ధం తర్వాత కీలక పరిణామం
- జెలెన్స్కీని మాస్కో ఆహ్వానించిన రష్యా
- ఆహ్వానంపై ఇంకా స్పందించని ఉక్రెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు దేశాల్లో భారీ నష్టం జరిగింది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పురోగతి లభించలేదు. తొలుత సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అయినా కూడా ఫలితాన్నివ్వలేదు. అనంతరం ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్తో సమావేశం అయ్యారు. అనంతరం వైట్హౌస్లో జెలెన్స్కీ, ఈయూ దేశాధినేతలతో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపారు. అయినా పంచాయతీ తెగలేదు. తాజాగా 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఈ ప్రణాళిక రష్యాకు నచ్చింది గానీ.. జెలెన్స్కీకి నచ్చలేదు. ట్రంప్ దూతలు ఇరు పక్షాలతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. గత వారం అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో చర్చలు జరిగాయి. మరోసారి ఆదివారం కూడా చర్చలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి:Virat Kohli : విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్.. ఆందోళనలో ఫ్యాన్స్
Also Read
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
- China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
- Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
అయితే ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా శాంతి చర్చలకు ఆహ్వానించింది. మాస్కోకు రావాలని కోరింది. గతేడాది కూడా ఇదే మాదిరిగా జెలెన్స్కీని ఆహ్వానించింది. కానీ అందుకు నిరాకరించారు. తాజాగా పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తూ మాస్కోకు రావాలంటూ అడిగింది. రష్యా ఆహ్వానంపై ఇప్పటి వరకు జెలెన్స్కీ ఇంకా స్పందించ లేదు.
ఇది కూడా చదవండి: MOTN Survey: ఇప్పటి వరకు భారత్ చూసిన అత్యుత్తమ ప్రధాని ఎవరు..? సర్వేలో ఆసక్తికర విషయాలు..
జెలెన్స్కీ-పుతిన్ మధ్య సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా దగ్గరగా ఉందని అమెరికాకు చెందిన ఒక అధికారి ఆక్సియోస్తో వెల్లడించారు. ఇక అబుదాబి వేదికగా మంచి చర్చలు జరుగుతున్నాయని మంగళవారం ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రాంతాల మార్పిడిపై పంచాయితీ తెగడం లేదు. భూభాగాలపై చర్చలు కొలిక్కి వస్తే యుద్ధానికి పరిష్కారం దొరికినట్లే. రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్పై ప్రధాన విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎవరికి ఏ భూభాగం లభిస్తుందనే దానిపై ఇరుపక్షాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించడం చాలా కష్టం అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం పేర్కొన్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!